పుట:విక్రమార్కచరిత్రము.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

187


తే.

గోరికలకంటె సాహస్రగుణితఫలము
బొరసి యవ్విభు వెయినోళ్ళఁ బొగడువారుఁ
గాని మిన్నక యుండెడుమానవుండు
మందునకునైన లేఁడు తన్మఖమునందు.

124


చ.

మన మలరంగ భూసురసమాజము కోటి భుజించెనేని క్రం
గనఁ దనుఁదాన మ్రోయుజయఘంటిక తన్మఘవాసరంబులం
దొనర నిమేషమాత్రమును నూరకయుండక మ్రోయుచుండె స
న్మునిజనకోటి నివ్వెర మునుంగ నమందరవంబు పెంపునన్.

125


ఉ.

ఏచినవాఙ్మయప్రతిభ లెంతయుఁ జిత్రముగా నధీతిబో
ధాచరణప్రచారణసదర్థముగా శ్రుతిశాస్త్రముఖ్యవి
ద్యాచతురత్వముల్ మెఱయునట్టి మహాత్ముల కాని, యెవ్వనిం
జూచిన నల్బమానవుఁడు సున్న తదీయసదస్యకోటిలోన్.

126


క.

సురుచిరమై యష్టాదశ
కరమితమై పసిఁడియిట్టికలనిర్మితమై
యరయఁ జతుస్సిత్యంబై
గరుడాకృతివేది యొప్పెఁ గడునద్భుతమై.

127


వ.

విధ్యుక్తప్రకారంబుగా మేధ్యాశ్వబంధనబంధురంబైన యూపంబుచుట్టును ఖాదిరంబులుం బాలాశంబులు బైల్వంబులుంగా నాఱేసియు, దేవదారుమయంబులు రెండును, శ్లేష్మాత్మకవిరచితం బొక్కటియునుంగా నేకోత్తరవింశతి యూపంబులు, నలంకారార్థంబుగా ననేకశాతకుంభయూపంబులుం ప్రతిష్ఠించి, యందు జలచరశతంబునుం బక్షిశతంబునుం జతుశ్చరణశతంబునుంగా మున్నూఱుపశువుల నమర్చి, తద్విశసనాంతరంబున నశ్వాలంభనం బొనరించి, తదీయంబులగు మాంసంబులలోనం దత్తద్దేవతాప్రియకరంబు లైనయాహుతులు గావించునప్పు, డనంగవతీమహాదేవిచేత నర్హంబు లగుహుతంబులు సేయించి, పరిశిష్టంబు లగునవయవంబులు ఋత్విజులు యథోక్తహుతంబులు గావించిరి. తదీయహోమగంధంబు ఘ్రాణతర్పణంబు గావించి శీలవతీసుతుండు సమస్తసదస్యయుతుండై