పుట:విక్రమార్కచరిత్రము.pdf/222

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

విక్రమార్కచరిత్రము


రమణునియానతి రమణి డగ్గఱి యోర్తు
        తమ్మిపుప్పొడిఁ దాను నెమ్మిఁ జల్లె
నయ్యనంగవతీకరాబ్జసంజ్ఞ నొకర్తు
        కువలయాధిపు వైచెఁ గువలయముల


తే.

వరుఁడు నీలోత్పలంబుల వైవ ననతి
హల్లకంబుల వైచెఁ దా నాత్మవిభునిఁ
గాంతలును దాను నిబ్భంగి గలసి మెలసి
వనజవనకేళి యొనరించి తనివిఁ బొంది.

59


క.

శ్రీరమణీమణిఁ గైకొని
క్షీరాంబుధి వెడలుగరుడకేతనుభంగిన్
నీరజలోచనఁ దోకొని
నీరజషండంబు వెడలె నృపవరుఁ డంతన్.

60


సీ.

ఆళికభాగంబున నంటినకురులతోఁ
        గరఁగినయంగరాగములతోడ
నరుణిమ వాసినయధరబింబముతోడ
        దీపించుమదనముద్రికలతోడ
దళ మైనమవ్వంపుఁబులకాంకురములతో
        జూపుల నునుఁగెంపు సొబగుతోడఁ
జెదరినమకరికాచిత్రపత్త్రికలతో
        బరఁగెడునూర్పుఁదెమ్మెరలతోడఁ


తే.

దొడల బెడఁగారునునువల్వతోడ నపుడు
రతిక[1]ళాసించివచ్చినరమణ మెఱయఁ
గొలను వెలువడి వచ్చి రాజలజముఖులు
వసుమతీనాయకానంగవతుల బలసి.

61


క.

చీనాంబరమణిభూషణ
నానాగంధానులేపనవమాల్యములన్

  1. అలసివచ్చిన