పుట:విక్రమార్కచరిత్రము.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

173


ఆ.

జలముమీఁద నీఁదుసర్వంసహాకాంత
కెలమి మూఁపుఁదెప్ప యిచ్చినట్లు
జలముమీఁద నీఁదుజలజాతనేత్రకు
నెలమి మూఁపుఁదెప్ప యిచ్చె విభుఁడు.

53


చ.

బిసములపేరులున్ సలిలబిందులకర్ణికలుం జెలంగఁగాఁ
బసిమి మెఱుంగుగాఁగ నవపద్మపరాగము చెందిరంబుగా
లసితపరాగకేసరకలాపసమగ్రత చిన్నపువ్వుగాఁ
బొసఁగ నమర్చి, నూతనవిభూషణఁ జేసెఁ బ్రియుండు ప్రేయసిన్.

54


చ.

కరమనురక్తి భూవిభుఁడు కంజదళాయతచారునేత్రపై
బొరిఁబొరిఁ జల్లునీట మయిపూఁత గరంగినఁ జన్నుదోయిపై
నరుదుగఁ గామముద్రలు బయల్ పడకుండఁగఁ గప్పె ధారణీ
శ్వరకరనిర్గళత్సలిలసాంద్రసరోజసమాజపత్త్రముల్.

55


చ.

అరవిరిదమ్మిఱేకుల నయంబున మైఁ గబళించి యొండొరుల్
సరిపడఁ జల్లులాడునెడఁ జంద్రనిభానన లెల్లఁ జల్లు బా
స్వరశతపత్త్రజాతములు చాల శరీరముఁ బొందిన, న్మనో
హరరుచిఁ బూనె భూపతి సహస్రవిలోచనుఁ గ్రేణిసేయుచున్.

56


శా.

రాజేంద్రుండు విదర్భరాజతనయారత్నంబుఁ బెన్నుద్దులై
రాజీవాక్షుల నుద్దులుంచుకొని నీరం జల్లుఁబోరాడుచో,
రాజీవాకర మొప్పె వాసవశచీరంభాదిదివ్యాంగనా
రాజత్ఖేలన ఘూర్ణమానఖధునీప్రాకామ్యముం బూనుచున్.

57


వ.

అయ్యవసరంబున.

58


సీ.

రాజుపంపున నొక్కరామ వైదర్భిపైఁ
        గరయంత్రధారోదకంబు గురిసె
నద్దేవికనుసన్న ముద్దియయొక్కర్తు
        జననాథుపై నించెఁ జల్లునీరు