పుట:విక్రమార్కచరిత్రము.pdf/208

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

విక్రమార్కచరిత్రము


దలఁపులుఁ గోర్కులున్ బెరయఁ దద్దయు నొప్పె విహారశయ్యపై
విలసితలీల బాల బొటవ్రేల నిలాతలమున్ లిఖించుచున్.

220


చ.

అతులితభావగర్భితములైన మృదూక్తులచేతఁ గేలికిం
బుతపుత వోవుచున్ననృపపుంగవుచిత్త మెఱింగి, నిర్గమో
ర్గతమతి యైననెచ్చెలికిఁ గన్నుల మ్రొక్కులతాంగిభావ మూ
ర్జితరతిరాజరాజ్యపదసీమకుఁ బట్టముగట్టె భూవిభున్.

221


వ.

తత్సఖీనిర్గమనానంతరంబున.

222


సీ.

మేలంపుమాటల మెచ్చులు పచరించి
        తోరంపుసిగ్గును దొలఁగఁ దోలి
పరమసౌఖ్యాయత్తపరిరంభణంబున
        దనువల్లిఁ బులకలుదళము కొలిపి
పారవశ్యదములై పరఁగు చిట్టంటులఁ
        జనవున గనయంబు సడలఁజేసి
క్రొత్తలయందెల్లఁ గ్రొత్తలై పరఁగెడు
        కామతంత్రంబుల గరిమ గఱపి


తే.

బాలికామణి సుఖవార్ధి నోలలార్చి
కాముసామ్రాజ్యలక్మికిఁ గర్త్రిఁ జేసెఁ
బ్రసవశరశాస్త్రమతకళాపారగుండు
సాహసాంకమహీపాలచక్రవర్తి.

223


చ.

చిలివిలిపోవుకోరికలు చిత్తములం దల లెత్తి, దేహముల్
పులకల నీనఁగాఁ దమకముల్ నిగుడన్, సుఖపారవశ్యతం
దలఁపుల కందగింపఁ, బ్రమదంబునఁ బట్టినచోటు లెల్లనుం
గళలకు నిక్కలై మెఱయఁగా, రతిసల్పిరి వేడ్క దంపతుల్.

224


క.

సురతావసానలీలా
పరిరంభము మీఁద రతికిఁ బ్రారంభముగాఁ