పుట:విక్రమార్కచరిత్రము.pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

విక్రమార్కచరిత్రము


గంకణంబులఝణత్కారంబు తోరమై
        యాశీర్నినాదంబు నాదరింపఁ


తే.

దరళతాటంకమౌక్తికోదారకాంతి
గండదర్పణదీప్తుల గారవింప
రాజముఖులు గావించి రారాజమణికి
రచితరుచి చక్రవాళనీరాజనములు.

209


వ.

తదనంతరంబ.

210


తే.

సౌమతేయాదిసామంతసముదయంబు
నాత్మసదనంబులకు నేఁగ నానతిచ్చి
యంతపురమున కేఁగి, ధరాధినాథుఁ
ఢుచితలీలానురక్తుఁడై యుండునంత.

211


చ.

అరవిరిదమ్మిఁ దేనియక్రియ న్మది రాగరసంబు గాఢమై
పరఁగ, విహారసౌధమణిబద్దగవాక్షము చేరి, వేడ్కఁ బ్రొ
ద్దరయు విదర్భరాజతనయం గరుణించినభంగి దోఁపఁగాఁ
జరమదిశామహీధరముచాటున కేఁగె దినేంద్రుఁ డత్తఱిన్.

212


తే.

కణఁక నన్యోన్యసంభోగకాంక్ష నున్న
సాహసాంకవిదర్భరాజన్యసుతల
హృదయరాగంబు పుంజమై యెసఁగె ననఁగ
నుదయరాగంబుతోఁ జంద్రుఁ డుల్లసిల్లె.

213


శా.

తత్కాలోచితకృత్యముల్ నడపి, రత్నస్నిగ్ధభూషావలీ
సత్కాంతిప్రకరంబు రాగరససాక్షాద్భావముల్ పూనఁగా,
నుత్కంఠైకసఖీసహాయుఁ డయి, రాజోత్తంసుఁ డుండెన్ సము
ద్యత్కేళీసదనాంతకాంతబహుశిల్పాకల్పతల్పంబునన్.

214


క.

అంతఁ జకోరిక మొదలగు
కాంతలు వైదర్భతనయఁ గై సేసి, మహీ