పుట:విక్రమార్కచరిత్రము.pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

157


య్యిఱిచనుముక్కులం దగిలి యెంతయు నొప్పె, రథాంగదంపతుల్
తెఱఁ గొదవంగఁ బట్టి తరితీపులఁ బెట్టు మృణాళమో! యనన్.

204


చ.

మలయజకర్దమం బలఁది మౌక్తికభూషణభూషితాంగియై
పొలఁతుక యోర్తు రాచిలుకబోద కరాగ్రమునంద యుండ, భూ
తలపతిదర్శనంబునకుఁ దత్పరతం జనుదెంచి నిల్చె, ను
జ్జ్వలరుచితో నృపాలునకు శారద సన్నిధి చేసెనో! యనన్.

205


ఆ.

రాజవరునిఁ జూచురాజబింబాస్యల
లికి మెఱుఁగుఁజూపుగములు పర్వి
కలువతోరణములు గట్టినవిధమున
నప్పురంపువీథు లొప్పుమిగిలె.

206


చ.

సమధికచంద్రికాధవళసౌధసమున్నతచంద్రశాలలం
బ్రమదము మీఱ నిల్చి, పురభామలు సేసలు చల్లుక్రొత్తము
త్తెములు దనర్చె, నమ్మదవతీమనుజేంద్రులమీఁద వేలుపుం
గొమిరెలు కల్పభూజనవకోరకముల్ గురియించిరో! యనన్.

207


వ.

ఇవ్విధంబున సర్వజననయనపర్వంబులగు నపూర్వవిలాసవైభవంబులు మెఱయం జని రాజమందిరంబు ప్రవేశించి, రథావతరణంబు సేసి యనంగవతీమహాదేవిని సఖీజనసమేతంబుగా నంతఃపురంబున కరుగ నియమించి, యాస్థానమండపంబున మణివిచిత్రద్వాత్రింశత్సాలభంజికాభవ్యంబైన దివ్యసింహాసనంబున నాసీనుండై యున్న యవసరంబున.

208


సీ.

కాంచనమణిముద్రికాప్రభాజాలంబు
        పసిఁడిపళ్ళెరములమిసిమిఁ జెనకఁ
గలికిక్రేఁగన్నులఁ గ్రమ్ముక్రొమ్మెఱుఁగులు
        వరదీపకళికల వన్నెవెట్టఁ
గమ్మపువ్వులతావి కర్పూరవర్తికా
        సౌరభంబులతోడ సరసమాడఁ