పుట:విక్రమార్కచరిత్రము.pdf/203

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

155


గొలువఁ గొలువుండుదువు గాక, కోమలాంగి
నీకు నేలమ్మ కన్నుల నీరునింప.

195


క.

పతికనుసన్నల మెలఁగుము
పతిహితు లగువారి నెఱిఁగి పాటింపు, మదిం
బతి దైవముగాఁ దలఁపుము
పతియ సుమీ యేడుగడయు భామామణికిన్.

196


వ.

అని బోధించి పునఃపువరాలింగనంబు చేసి, తదీయనర్మసఖియగు చకోరికం జూచి యిట్లనియె.

197


సీ.

పతియును నేనును బార్వతీపతిచేత
        వరముగా గొంటి మీవాలుఁగంటి
నర్కతేజుఁడు విక్రమార్కక్షమానాథుఁ
        డల్లుఁ డయ్యెడిభాగ్య మబ్బె మాకు
రమణునితోడ దూరముగాఁగ నేగుచో
        బొలఁతికి నీయట్టిబోటి గలిగె
నేమిటఁ జూచిన నీయింతి తొలుమేన
        సుకృతంబు సేయుట ప్రకటమయ్యె


తే.

వింక నిటమీఁదఁ దగుబుద్ధి యెఱుఁగఁజెప్పి
విభునిచిత్తముపార్జించువెరవు గఱపి
పొడయు నీడయుఁ బోలె వీడ్వడక మెలఁగి
యబలకంటికి ఱెప్పవై యరయవమ్మ.

198


వ.

అని యప్పగించి యనుపుటయుఁ, జకోరికాప్రముఖసఖీసహస్రంబు గొలువ నాందోళికారూఢయై, చనుదెంచినప్రియాంగనం గనుంగొని సంతుష్టాంతరంగుండై సాహసాంకమహీనాథుండు.

199


చ.

వినయముతో విదర్భపతి వీడ్కొని, దేవియుఁ దాను రత్నకాం
చనరథ మెక్కి, వందిజనసంస్తుతి మాగధగానమంజుల