పుట:విక్రమార్కచరిత్రము.pdf/202

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

విక్రమార్కచరిత్రము


నవరత్నాభరణవ్రజంబు నయనానందారవిందాక్షులన్
నవశస్త్రావళులన్, వధూవరులకున్ వైదర్భుఁ డిచ్చెం దగన్.

190


క.

చుట్టములసురభి వీవని
భట్టికిఁ, దగఁ బ్రియము చెప్పి, పంకజనయనా
పట్టాంశుకమణిభూషా
రట్టజహయగంధసింధురంబుల నొసఁగెన్.

191


క.

ఆసమయమునఁ గుమారిం
గైసేసి, తదీయజననిఁ గాన్పించి, చకో
రీసుదతి సుప్రయాణ
శ్రీసూచన చేసి, ప్రణతి సేయించుటయున్.

192


తే.

తల్లిపాదంబులకు మ్రొక్కి తలిరుఁబోఁడి
యశ్రుపూరంబు ఱెప్పల నప్పళింపఁ
గలికికన్నులు మకరందజలము గ్రమ్ము
కమ్మతమ్ములతమ్ములై కరము మెఱసె.

193


వ.

అత్తెఱం గెఱింగి, యమ్మహాదేవి యక్కుమారీరత్నంబు నక్కునం జేర్చి, చెక్కుటద్దంబులు పుణుకుచు నిట్లనియె.

194


సీ.

ఏరాజు నుజ్జయినీరాజ్యపదమున
        నంబికాదేవి పట్టంబు గట్టె
నేరాజు తనసభ కేతెంచిన విరించి
        యచ్చెరువంది బ్రహ్మాస్త్ర మిచ్చె
నేరాజు నాట్యవిద్యారసజ్ఞత మెచ్చి
        భద్రాసనం బిచ్చె బలవిరోధి
యేరాజునకుఁ గల్లె నీశ్వరవరగర్వ
        యుతుని సిద్ధపురీశు నోర్చుకడిమి


తే.

యట్టిరాజు పట్టపుదేవివైన నీవు
సకలరాజన్యకాంతలు చరణయుగముఁ