పుట:విక్రమార్కచరిత్రము.pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

విక్రమార్కచరిత్రము


ననిచి, యథోచితక్రియల నమ్మనుజేశ్వరుఁ డుండునంత, స
ద్వినయధనుండు భట్టి చనుదెంచి నమస్కృతి చేసి, యిట్లనున్.

168


క.

పురిశృంగారముఁ జూచిన
నరులకు నెల్లను నవాఙ్మనసగోచరమై
కర మొప్పుచున్న, దెల్లియ
పరిణయలగ్నంబు, వలయుపను లొడఁగూడెన్.

187


శా.

భూపాగ్రేసర! యుష్మదీయచరు లుద్బోధింప నానావిధ
ద్వీపానీతగజాశ్వరత్నరమణీదివ్యాంబరశ్రేణిచే
నీపాదాంబుజసేవ సేయుటకునై నెయ్యంబుతో వచ్చినా,
రాపూర్వాపరదక్షిణోత్తరదిగంతానంతధాత్రీశ్వరుల్.

170


వ.

అని విన్నవించి వారలఁ గానిపించుటయు.

171


క.

సకలనృపప్రకరంబును
బ్రకటితముగ సాహసాంకుపదపీఠికకున్
మకుటమణిదీపకళికా
నికరము నీరాజనముగ నిర్వర్తించెన్.

172


వ.

అప్పు, డప్పుడమిఱేఁడు తదానీతంబులైనపావడంబులు గైకొనియె, నంతం దదనుమతి వడసి భట్టియు రాజలోకంబును నిజనివాసంబులకుం జనిరి. మఱునాడు శకమర్దనుండు ప్రభాతసమయసముచితకృత్యంబులు నిర్వర్తించునంత, నక్కడ.

173


చ.

హితులఁ బ్రధానవర్గముఁ గవీంద్రుల బంధుల మిత్త్రులం బురో
హితులను దండనాథుల మహీపతులం బరివారముం గళా
వతులను మాగధోత్తముల వందిజనంబు దిగంతరాగత
క్షితిపతులన్ విదర్భపతి శ్రీ వెలయంగ సభాంతసీమకున్.

174


వ.

ప్రియపూర్వకంబుగాఁ బిలిపించి, గంధాక్షతకర్పూరతాంబూలంబు లాదిగా సత్కారంబు లొనరించె, ననంతరంబ.

175