18
పైఁ గథాంశములను బరిశీలించినచో నీ విక్రమార్కచరిత్రము నందు సుమా రొక యిరువది కథ లున్నట్లు మసము తెలిసికొనగలము. అంతమాత్రముచేత దీని మహాకావ్యత్వమున కెట్టిలోపమును సంక్రమింపదు. మహాకావ్యము నందు భిన్నకథ లనేకము లుండుట దోషము కాదనుటకు మహాకవి కాళిదాసు “రమువంశ" మే ప్రబలతార్కాణము. ఇంతేకాక రఘువంశము నందు ఒకే వంశమునకుఁ జెందిన 22రు రాజుల వర్ణనాంశములు కలవు. ఇందట్లు గాక ఈ యిరువది కథాంశములును నాయకుఁ డగు విక్రమార్కుని గుణౌదార్యాదులను బ్రశంసించునవే యగుట నిందు వస్తైక్యత కలదనుటలో సందేహము లేదు. హరవిలాసమును నిట్టిదే కదా!
కథానాయకుని గుణగణములు
ఏతత్కావ్యనాయకుఁ డగు విక్రమార్కుఁడు పౌరాణికపురుషుఁడు కాక చరిత్రప్రసిద్ధుఁడు. విక్రమశక మితనిపేరఁ బుట్టినదే. సాహసపరాకమౌదార్యాది గుణసంపత్తిచేత లోకోత్తరుఁడు. నిజఫాలతలాగ్రచర్మమును ఖడ్గముతో జీల్చి చూపిన విక్రమార్కుని సాహసమున కచ్చెరువంది బ్రహ్మయిట్లు ప్రశంసించెను.
“ఆర్వురు చక్రవర్తులు పదార్వురు రాజులు విశ్వధారణీ
నిర్వహణప్రభావమున నేర్పరులైనను, వీని సాటియే
సర్వఫలప్రదానమున సాహసికత్వరమాసమగ్రతన్
గర్వితవీరవైరిచయఖండనమండనవిక్రమక్రియన్.(ఆ. 2–84)