పుట:విక్రమార్కచరిత్రము.pdf/178

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

విక్రమార్కచరిత్రము


వ.

అనిన విని ప్రహసితముఖారవిందుండై సుమతిసూనుం డాక్షేపవాగ్గర్జితంబుగా నిట్లనియె.

65


క.

ఇట్టి వివేకమహోన్నతి
యిట్టినయోచితవిహార మేరికిఁ గలదే?
యిట్టినిను దూతఁగాఁ జే
పట్టినపతి వేఱె భాగ్యపరుఁ డన నేలా!

66


వ.

అని మఱియు నిట్లనియె.

67


తే.

తొల్లి యొకకాకి రాయంచఁ దొడరినట్లు
శకుఁడు సమరనిశ్శంకుని సాహసాంకుఁ
జెనకఁజూచుట యెన్న, నీతనికిఁ దనకు
హస్తిమశకాంతరము గాదె యలవుకలిమి.

68


క.

మాటలు పదివేలాడినఁ
బోటరియై రణములోన భుజబల మెల్లం
దేటపడఁ జూపకుండిన
మేటియశం బేల కలుగు మీరాజునకున్.

69


శా.

భూచక్రాఖిలరాజ్యభోగ మొనరుం బోరన్ జయం బందినం,
బ్రాచీనాయకలోకలోలనయనాపంచాస్త్రకేళీకళా
వైచక్షణ్యము సంభవించుఁ గదనవ్యాపారతన్ మాలినన్;
“కా చింతా మరణే రణే" యనుట నాకర్ణింపవే యెన్నఁడున్.

70


ఉ.

ఇంచుక సూదివేదన సహించినమాత్ర నృపాంగనాకుచో
దంచితసౌఖ్యకేళి సతతంబును [1]గంచులి గాంచు, నాజి ని
ర్వంచనఁ దీవ్రబాణనికరక్షతదేహుల కబ్బవే మరు
చ్చంచలలోచనాఘనకుచస్తబకద్యుతిసంగసౌఖ్యముల్.

71


క.

కావున, మీభూవిభునకు
నీవిధ మంతయును దెలియ నెఱుఁగించి, రణ

  1. ఱవిక