పుట:విక్రమార్కచరిత్రము.pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

127


తే.

గమలజుని వేదపఠనంబు కవలువోయె
నద్రు లెల్లను నచలత్వ మపనయించె
దిగ్గజంబులు జిఱజిఱదిరిగి మ్రొగ్గె
వారిరాసులు పిండిలివండు లయ్యె.

50


వ.

అంత.

51


క.

సంగరములు గలుగుటఁ జతు
రంగమ్ములు సమ్మదాంతరంగము లగుచున్
గంగాతరంగసంగత
రంగములై బెరసె నెరసి రంగక్షోణిన్.

52


ఉ.

చుట్టము లైన రాహుతులు సూరెలఁ బేరెలమిన్ జవోజ్జ్వలా
రట్టజవాహరోహణవిరాజితులై తనుఁ జేరి కొల్వఁగాఁ,
బట్టపుదంతి నెక్కుకొని భట్టి నృపాలునిసేన కంతకుం
బెట్టనికోటయై నడచె భీకరసన్నహనాభిలాషుఁడై.

53


మ.

 జయలక్ష్మీసతితో నన గవతి నిచ్చం గైకొనం గోరి, యు
జ్జయినీనాథుఁడు దివ భూషణవిలాసం బొప్ప నాయోధన
ప్రియుఁడై పెండ్లికి నేగుభంగి వెడలెం; బృథ్వీజనశ్రేణికా
నయనానందద రత్నకాంచననవీనస్యందనారూఢుఁడై.

54


వ.

ఇవ్విధంబున రాజమందిరద్వారంబు వెడలి, యాంగికంబులగు శుభసూచకంబులు ననుకూలసమీరసంచారంబులును నానాదర్శాదిమంగళద్రవ్యసందర్శనంబులు, నవనీసురాశీర్వాదంబులు వగణ్యపుణ్యాంగనాముక్తమౌక్తికశేషావిశేషంబులును, నభంగతురంగహేషాఘోషంబులు నంగీకరించుచు, నిరర్గళప్రసాదశరణారిశరణుడై పురంబు నిర్గమించి, సకలసేనాసమన్వితుండై కదలి కతిపయప్రయాణంబుల విదర్భానగరంబు చేరంజన, నప్పురంబునకుం గ్రోశమాత్రంబున నతిపవిత్రంబైన వేత్రవతీతటంబున, నతిమాత్రవిశాలరమణీయంబును సమస్థలంబును నైనస్థానంబున, నత్యాశ్చర్యకరణప్రచండంబయిన యోగదండంబున వ్రాసినం దత్క్షణంబ.

55