పుట:విక్రమార్కచరిత్రము.pdf/173

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

125


బరభూవరవ్యూహభయదోగ్రసన్నాహ
        గర్వతసుభటవర్గములతోడ


తే.

మందరాచలమంధానమధ్యమాన
నిరవధికనీరనిధిఘోషనిర్విశేష
పటుపటహముఖ్యవాద్యజృంభణముతోడ
భట్టి చనుదెంచి వసుమతీపాలుఁ గాంచె.

41


తే.

అర్థి దండప్రణామంబు లాచరింప
నమ్మహామంత్రి ముఖ్యుని, నా నరేంద్రుఁ
డతిముదంబున నాలింగనాదులైన
సముచితోపచారంబుల సత్కరించి.

42


వ.

సాదరావలోకంబున నాలోకించి లోకవృత్తాంతంబు నడుగుటయు, నతనికి సుమతిసూనుం డిట్లనియె.

43


సీ.

ఏరాజునకుఁ జెల్లునెంతయు నరుదైన
        మణిపాదుకాదులు మహిమఁ గొనఁగ
నేరాజునకుఁ జెల్లు నింద్రుని మెప్పించి
        నవరత్నసింహాసనంబు వడయ
నేరాజునకుఁ జెల్లు నీరజాసనుసభ
        బ్రహ్మాస్త్రలాభసంపద వహింవ
నేరాజునకుఁ జెల్లు నితరదుర్లభమైన
        యుట్టిచేరులుగోయు దిట్టతనము


తే.

దేవపతి యైనశ్రీమహాదేవుదేవి
కాళికాదేవి యేరాజుకడిమి మెచ్చి
లీల నుజ్జని వేయేఁడు లేల నిచ్చె
ననుచు నినుయెల్ల దేవర నభినుతించు.

44


చ.

అనిన దరస్మితాస్యుఁడగు నమ్మనుదేంద్రునితోడ భట్టి యి
ట్లను, జగదంబ వత్సరసహస్రము రాజ్యము నీకు నిచ్చె, నా