పుట:విక్రమార్కచరిత్రము.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

విక్రమార్కచరిత్రము


మెఱుఁగుమొత్తంబులు మెఱసె నుత్తరమున
        గడఁగె దక్షిణపుమేఘములగములు
ప్రాలేయభానుండు పరివేషగతుఁ డయ్యెఁ
        జాతకంబులు నింగి సంచరించె


తే.

నెఱలపెనుపట్టె నేలపైఁ గొఱలఁజొచ్చె
మొనసి చీమలగమిగ్రుడ్డు మోవఁదొణఁగెఁ
గుజముకొనగొమ్మ డిగి క్రిందికొమ్మమీఁది
నిలుపుఁగైకొనుపులుఁగులయెలుఁగు లెచ్చె.

27


ఉ.

తూనిఁగలాడెఁ, దోయనిధిఁ దోరపు మోత జనించెఁ, బంక్తులై
కానఁబడెన్ బలాకములు, కప్పయెలుంగు చెలంగె నిర్జల
స్థానములందుఁ, గుంజముతుదం గృకలాసము నిల్చి నింగికై
యాననమెత్తె, భూమిరజ మంగములన్ బెరయించెఁ బిచ్చుకల్.

28


క.

తదనంతరంబ, జనముల
కిది పగ లిది రాత్రి యనుచు నేర్పఱుపంగా
హృదయముల కగోచరమై
చదలం బొదలంగఁజొచ్చె జలధరవితతుల్.

29


క.

ధారణి గలమేలెల్లను
ధారాళకరాళవర్షధారలచేతన్
నీరామని గాఁగల దని
పూరాల్చినభంగి ముసురు పొరిఁబొరి గురిసెన్.

30


సీ.

ప్రథమోదబిందులఁ బల్లవించె ననంగ
        నింద్రగోపద్యుతి నిలఁ దనర్చె
భానుచంద్రుల సూడుపట్టి గెల్చె ననంగఁ
        గంధరపటలాంధకార మడరె
జలదానిలంబునఁ బులకించెనో యనఁ
        గుటజభూజంబులు కోరగించె