పుట:విక్రమార్కచరిత్రము.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

115


కరము కరమునఁ గీలించి కరముఁ బ్రీతి
నందుఁ డాతని కనియె నానంద మెసఁగ.

128


ఉ.

నిందకు నోర్చి దోషము గణింపక, రిత్తకు రిత్త శారదా
నందునిఁ జంపు మన్న, నిది న్యాయము గాదని యెంత చెప్పినన్
మందమతిన్ వినం దెఱఁగుమాలిననన్ను మొఱంగి కాఁచి, మ
మ్మిందఱ సత్క్రియానిరతి నిప్పుడు గాఁచితి, చెప్ప నేటికిన్.

129


తే.

దోసమును నపకీర్తియుఁ దొలఁగఁబెట్టి
నాఁడు గురుఁ గాఁచుకొంటిని, నేఁడు నన్ను
సుతునిఁ గాఁచితి త్రిస్థానశుద్ధిగాను
నీఋణం బింక నేమిట నీఁగువాఁడ!

130


క.

నీకతమున నిహపరములు
నా కిట సిద్ధించె, నీ సనాతనబుద్ధి
ప్రాకారముకలిమి నఘా
నీకంబుల గెలచు టరుదె, నృపనయవేదీ!

131


తే.

అని యనేకవిధంబుల నాదరించి
మంత్రి కతిసుస్థిరైశ్వర్యమహిమ యొసంగి
శారదానందగురునకు దారవోసి
యగ్రహారసహస్రంబు నర్థి నిచ్చె.

132


క.

ధృతిమంతుఁడు ధీమంతుఁడు
మతిమంతుఁడు నైనమంత్రి మహి నెత్తఱి నే
నతిసంపద గోరెడుఁబతి
కతఁ డబ్బుట పెన్నిధాన మబ్బుటగాదే!

133


ఆ.

వరరథాశ్వసుభటవర్గమెల్లను గల్గి
చాలినంతభూమి యేలఁగల్గి
తగినమంత్రి లేని ధరణీశురాజ్యంబు
గాలిఁ దూలు దీపకళికఁ బోలు.

134