పుట:విక్రమార్కచరిత్రము.pdf/159

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111


దుర్గమం బగువనదుర్గంబు ప్రవేశించినం, దత్సైనికు లందఱు నన్నిమార్గంబుల నరిగి, యొండొరులం గడవం బాఱియు, నెలుంగెత్తి చేరం జీరియు, నీఱంబులు దూఱియుఁ, జెట్టుచెట్టును ముచ్చుట్టుదిరిగియుఁ, దిరిగినచోటులనె తిరిగియు, నడవియెల్లను దడవితడవి యొక్కయెడ నక్కుమారుండొక్కరుండును దిక్కుమాలి దీనదశం బిశాచంబుచందంబున సతతంబును “ససేమిరా" యనుచుం బరిభ్రమించుచున్నం గని విన్నవించిన, నందభూపాలుండు నిజనందను విజయపాలుం దోడ్కొని సపరివారంబుగా బురంబునకు నేతెంచి; యక్కుమారుని యపస్మారంబునకు దేవభూదేవతాసమారాధంబుల మణిమంత్రతంత్రక్రియాసాధనంబుల నానావిధభూతబలివిధానంబుల మహాదానంబుల నాచరించి, యేమిటను డిందుపాటు లేకుండిన నందభూపాలుండు తనడెందంబునం గొందలం బందుచు, నిక్కుమారుని వికారంబునకుఁ బ్రతీకారం బెవ్వండు సేయసమర్ధుం డతనికి నర్ధరాజ్యం బిచ్చెద నని సర్వదిశల విశదంబుగాఁ జాటంబనిచి, శారదానందగురుం డొక్కరుండునుందక్క నిక్కొఱగామి సక్కఁజేయ నెక్కడివాఁడునుం గొఱగాఁడ. అజ్ఞానంబున నాసుజ్ఞానవిధానంబు గోలుపోయితి, నేమి సేయుదు నని పరితపించుచున్నం గని బహుశ్రుతుండు నేలమాలెనున్న త్రికాలవేదిపాలికిం జనుదెంచి నమస్కరించి, యామూలచూడంబుగాఁ దద్వృత్తాంతం బంతయు నెఱంగించి, యిట్లనియె.

107


తే.

వేల్పులకు మ్రొక్కి, వెజ్జులవెంటఁ దిరిగి
మంత్రవాదుల రప్పించి, మందు లరసి
కొడుకువేఁదు ఱేమిటఁ దీర్పగూడకున్న
బుడుకువేఁదుఱు గొన్నాఁడు పుడమిఱేఁడు.

108


గురువు రాజకుమారుని యపస్మారంబు నివారించుట

సీ.

నావుడు, శారదానందుఁ డూహించి ది
        వ్యజ్ఞానసరణి సర్వంబు నెఱఁగి
యిది యేను జక్కఁజేసెద, నీవు నందభూ
        మీశునికడ కేగి యిట్టులనుము,
మనశారదానందుననుఁగునందన, సప్త
        సంవత్సరప్రాప్తసంవిదగ్ధ