పుట:విక్రమార్కచరిత్రము.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

12

8. కృతిభర్త యగు సిద్ధనమంత్రి దేవరాయ మహారాయల మంత్రివల్లభుఁ డగు చామనామాత్యుని వలన రాజలాంఛనములు పడసెను. చామనామాత్యుఁడు దేవరాయల కడ 'దండనాయకుఁడు గాఁ గూడ నుండె నని శ్రీమ ద్వవల్ల య, వరసుత చామన దండాథినాథ సామ్రాజ్యరమాసామగ్రీ సంపాదక...(ఆ. 167)

4. జక్కన తాతయగు పెద్దయామాత్యుఁడు నెల్లూరి తిరుకాళవిభుని మెప్పించి యతనిచే బహూకృతుఁ డాయెను.

5. కవీంద్రకుంజరుఁ డగు వెన్నెలగంటి సూరన రెడ్డివేమ నరపాలకుచేత మహాగ్రహారములు పడసెను. ఈ సూరనకవి కృతికర్త యగు సిద్ధనకు “పెదతండ్రిగా సన్నుతిగన్నవాఁడు.

పైనిఁ బేర్కొనిన రాజేంద్రచోడుఁడు మున్నగువారినిఁబట్టి కృతికర్త కృతిభర్తల కాలమును నిర్ణయింపవలెను. వీరేశలింగము పంతులుగారు మున్నగువా రిట్లే చేసిరి. కాని యీ విమర్శకుల యభిప్రాయములు పరస్పరము భేదించుచున్నవి. వారి వాదములను పునరుద్ధరించిన గ్రంథవిస్తరము కాగలదు. కావున వాదసారాంశములు మాత్రమే తెలుపఁబడును.

సూరన సోమయాజికి ఎద్దనపూడిని అగ్రహారము నొకఁగిన రాజేంద్రచోడుఁడు క్రీ.శ. 1158 నుండి 1188 వఱకు నుండెనని శ్రీ వీరేశలింగం పంతులుగారు.

“ఈ రాజేంద్ర చోడరాజు వెలనాటి దుర్జయవంశజుఁడు క్రీ.శ.1163 నుండి 1181 పఱకు పాలించిన రాజేంద్ర చోడరాజు అనుటకు సందియము లే”దని శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు.

పలువురు వెలనాటి రాజేద్రచోడులలో కడపటివాఁ డగు కులోత్తుంగ రాజేంద్రచోడుఁడు మనుమసిద్ధికి సమకాలికుఁ డనియు (నితని శాసనములు 1171-1176 సంవత్సరములో కన్పట్టుచున్నవి.) కావున నీ కులోత్తుంగ రాజేంద్రచోడుఁడే సూరన సోమయాజికి అగ్రహార మొసంగి యుండుననియు కవితరంగిణికర్త అభిప్రాయములు.

దేవరాయలు క్రీ.శ. 1408-1422 సంవత్సరము వరకు కర్ణాటకరాజ్యము పాలించె ననియు సిద్ధనమంత్రియు, నితని తండ్రి జన్నయయు నితని యొద్ద మంత్రులుగా నుండిరని శ్రీ వీరేశలింగం పంతులుగారు.