నరసింహదేవునకుం గృతి నిచ్చుట
వ. |
అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి, యనన్యసామాన్యయగునిక్క
వితావధూమణికిఁ బురుషుండు పురాణ పురుషుండు గావుతమని, యఖిల
లోకాధీశ్వరుడును, నతులకల్యాణగుణగణా లంకారుండును, ననవరత
లక్ష్మీసమేతుండు, నాదిమధ్యాంతరహితుండును,నభిమతఫలప్రదాయ
కుండును, నగు నహోబలశ్రీనృసింహదేవునకు నిచ్చెదనని తలంచి, య
ఖిల వేదవేదాంత వాగ్గోచరుండగు నద్దేవున కతితుచ్ఛంబులగు మద్వా
క్యంబు లర్పింతు ననుటయు మహాద్రోహంబగునో యని శంకించి
యప్పరమేశ్వరుం డాశ్రితసులభుం డగుటయు, మత్కవిత్వంబు తదీయ
వరప్రసాదలబ్ధం బగుటయు, భావించి, మనంబున నిట్లని వితర్కించితి.
| 16
|
క. |
వనరాశిజలము గొని యా
వనరాశికి నర్ఘ్య మిచ్చు వడువున, హరి యి
చ్చినవాక్యములనె యతనికి
ననయము గృతి సెప్పి సుకృతి నగుదు ధరిత్రిన్.
| 17
|
క. |
గురుఁడును దల్లియుఁ దండ్రియుఁ
బురుషుఁడు విద్యయును దైవమును దాతయు నాఁ
బొరి నేడుగడయు దా నై
హరి నను రక్షించుఁ గాత ననవరతంబున్.
| 18
|
క. |
తనపేరిటివాఁ డనియును
దనదాసులదాసుఁ డనియుఁ దన కీకవితా
వనితామణి నిచ్చినవాఁ
డనియును రక్షించుఁ గాత హరి నన్ను దయన్.
| 19
|
క. |
కృతి బోధామృతరస మఁట,
కృతికథ శ్రీరామచంద్రకీర్తన మట, త
|
|