పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

5

నరసింహదేవునకుం గృతి నిచ్చుట

వ.

అని సకలజనసమ్మతంబుగా నుపక్రమించి, యనన్యసామాన్యయగునిక్క
వితావధూమణికిఁ బురుషుండు పురాణ పురుషుండు గావుతమని, యఖిల
లోకాధీశ్వరుడును, నతులకల్యాణగుణగణా లంకారుండును, ననవరత
లక్ష్మీసమేతుండు, నాదిమధ్యాంతరహితుండును,నభిమతఫలప్రదాయ
కుండును, నగు నహోబలశ్రీనృసింహదేవునకు నిచ్చెదనని తలంచి, య
ఖిల వేదవేదాంత వాగ్గోచరుండగు నద్దేవున కతితుచ్ఛంబులగు మద్వా
క్యంబు లర్పింతు ననుటయు మహాద్రోహంబగునో యని శంకించి
యప్పరమేశ్వరుం డాశ్రితసులభుం డగుటయు, మత్కవిత్వంబు తదీయ
వరప్రసాదలబ్ధం బగుటయు, భావించి, మనంబున నిట్లని వితర్కించితి.

16



క.

వనరాశిజలము గొని యా
వనరాశికి నర్ఘ్య మిచ్చు వడువున, హరి యి
చ్చినవాక్యములనె యతనికి
ననయము గృతి సెప్పి సుకృతి నగుదు ధరిత్రిన్.

17


క.

గురుఁడును దల్లియుఁ దండ్రియుఁ
బురుషుఁడు విద్యయును దైవమును దాతయు నాఁ
బొరి నేడుగడయు దా నై
హరి నను రక్షించుఁ గాత ననవరతంబున్.

18


క.

తనపేరిటివాఁ డనియును
దనదాసులదాసుఁ డనియుఁ దన కీకవితా
వనితామణి నిచ్చినవాఁ
డనియును రక్షించుఁ గాత హరి నన్ను దయన్.

19


వ.

అదియునుం గాక.

20


క.

కృతి బోధామృతరస మఁట,
కృతికథ శ్రీరామచంద్రకీర్తన మట, త