పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


క.

అమల మనంతవిలాసం
బమృతము సర్వగము సచ్చిదాకాశ మనా
శము పరిపూర్ణం బగుతే
జము గల; దది వెలుఁగు సర్వసంశ్రయ మగుచున్.

154


క.

అది కదలియుఁ గదలనిదెస
నుదయించెను విష్ణుఁ, డతనియుదరంబునఁ బెం
పొదవిన కనకాంబుజమున
విదితంబుగ బ్రహ్మ పుట్టె విశ్వజనకుఁ డై.

155


వ.

అద్దేవుండు సకలభూతంబులం దత్కర్మానుసారంబుగం బుట్టించుటయు,
నీభారతవర్షజాతు లగు వారలు దుర్వ్యసనాక్రాంతస్వాంతులును
నల్పాయువులును నై దుఃఖించుచున్న, వారలం గనుంగొని దుఃఖు
లగుపుత్త్రులం జూచి శోకించుజనకుండునుంబోలెఁ గరుణించి, యేకా
గ్రచిత్తుం డై కొండొకసేపు చింతించి, జపదానతపస్తీర్థంబు లత్యంత
దుఃఖనివారకంబు గా వని సకలదుఃఖనిర్హరణం బై పరమానందంబు
నొందించునట్టి నిర్మలజ్ఞానోపదేశంబుఁ జేయం దలంచి, పరమేష్ఠి తన
మనంబువలన నన్నుఁ బుట్టించి నాకు సంసారవ్యాధిభేషజం బగుపర
మజ్ఞానంబు బహుప్రకారంబుల నుపదేశించి యి ట్లనియె.

156


గీ.

కడఁగి యేతత్క్రియాకర్మకాండసరణిఁ
గర్మకారుల కెఱిఁగింపు, కడు విరక్తు
లైనవారికి నాత్మవిజ్ఞానమార్గ
మర్థి బోధింపు, పుత్త్ర నీ వనుదినంబు.

157


వ.

అని యాజ్ఞాపించిన యక్కమలసంభవుచేత నియుక్తుండ నై యాయా
భూతపరంపరయందు విహరించుచుండుదు.

158


గీ.

ఊరకుండుదుఁ, గర్తవ్య మొకటి లేదు,
శాంతమతిఁ జేసి నిజమానసంబు గెలిచి