పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


        తన్నుఁ దా నెఱుఁగక తన్నుకొనుట,
కదలి యిట్టట్టు పోఁ గాళ్లు రా కుండుట,
        గురుజనశిక్షలఁ గుతిలపడుట,


గీ.

యివియు మొదలు గాగ నెన్నఁ బె క్కగునట్టి
బోధ లనుభవించు బాల్యవృత్తి
పరమమునివరేణ్య ప్రత్యక్షనరకంబు,
దీన నేమి సుఖము తెలుపవయ్య.

111


క.

తల్లియుఁ దండ్రియు నితరులుఁ
బల్లిదులై తోడ నాడుపడుచులు నడువన్
దల్లడపడుశైశవ మిది
చెల్లంబో దురితదుఃఖశీలము గాదే.

112


వ.

మఱియు యౌవనం బెట్టి దనిన.

113


క.

బాలత్వ మెడలి, తరుణిమ
కా లూఁదఁగఁ, జిత్తభవవికారంబులు మైఁ
గీలుకొని త్రుళ్లఁ జేయఁగఁ,
పాలసుఁ డై దురితవితతిపా ల్పడి పోవున్.

114


గీ.

యౌవనంబునందు నవికారి యై తన్నుఁ
బరులు మే లనంగ బ్రతికెనేని,
యతఁడు పుణ్యపురుషుఁ డతఁ డుత్తమోత్తముఁ
డతడు వంద్యమానుఁ డఖిలమునకు.

115


క.

వినయము బుధసంశ్రయ మై
ఘనగుణమణిచయము సానుకంపాస్పద మై
తనరెడుపుణ్యాత్ములయౌ
వన మతిదుర్లభము గగనవనమును బోలెన్.

116


వ.

మఱియు స్త్రీ లెట్టివా రంటేని.

117