పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

193

సీ. అతనుసంవిత్సూర్యుఁ డఖిలంబు నెఱిఁగించు
                    పరమభాస్వరచిత్ప్రభామయుండు,
     త్రసరేణువులు జగత్రయములు, తత్కాంతి
                    విజ్ఞానరకవిచేత వెలుఁగు నెపుడు,
     గాలసత్తయును, నాకారసత్తయుఁ, బరి
                    స్పందసత్తయుఁ, జిదానందశుద్ధ
     చైతన్యసత్తయు, సర్వంబుఁ బరమాత్మ
                    మాయారజం; బకంపమునఁ బొరలు
గీ. జగము లనియెడి నీమహాస్వప్నమునను
     బహుతరస్వప్నములు గాంచు; బ్రహ్మ మదియ,
     శాంతిసంపన్న మైన నిజస్వరూప
     మెన్నడును విడువఁగలే దహీనచరిత.106
క. అరఁటియుఁ బత్త్రంబులచేఁ,
     బొరలైన ట్లంతరములఁ బొందుచుఁ బ్రహ్మ
     స్ఫురణవివృత్తముఁ బరపును
     బొరలును నై విశ్వ మగుఁ బ్రబోధనిధానా.107
క. తగ సూక్ష్మంబు నలభ్యము
     నగుటఁ బరబ్రహ్మరూప మణు వగు నది దా
     నగణితశక్తి ననంతం
     బగుటను గనకాచలాదు లై పొలు పొందున్.108
గీ. దీని పరమాణువులు మేరుదినకరాదు
     లవి యసఖ్యంబు లగు, బరమాణు వదియ
     సర్వపూరక మగుమహాశైల మయ్యె,
     జ్ఞప్తిమయ ముగుదీనిమజ్జయ జగంబు.109
వ. అనఘా విజ్ఞానమాత్రంబ యిీజగత్రయం. బని మహీపాలుండు చెప్పిన