పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

వాసిష్ఠరామాయణము

     మనము చేతన; మనమును దునిమి వైచి,
     యాత్మనిష్ఠుఁడ వై యుండు, మట్లు సేయ,
     దుష్కరము నీకు మఱి లేదు దోషదూర.105
వ. అని మునీంద్రుం డక్కుమారు బోధించె నని చెప్పి వసిష్ఠుండు మఱి
     యు ని ట్లనియె.106
క. ఈ దాశూరాఖ్యానము
     వేదాంతసమాన మాత్మవిద్యామృతమున్;
     మోదమున నీకుఁ జెప్పితి
     నాదరమున; నిది జగద్విహారము రామా.107
వ. అని దాశూరోపాఖ్యానంబు సెప్పి యింక నీస్థితిప్రకరణతాత్పర్యంబం
     తయు నుపదేశంబునం జెప్పంబడు తత్ప్రకారం బెఱింగించెద, సావ
     ధానుండవై విను మని వసిష్ఠుం డి ట్లనియె.108
క. తుది మొదలు లేక కాలం
     బిద మిత్థ మనంగరాక యిందుల నూ
     ఱేం డ్లిది యంత యింతకష్టపు
     బ్రతుకులయం దేమి యాస్థ పరమవివేకా.109
క. భావశ్రీమయగర్విత
     మై వెలసినయంతరాత్మ నడఁచినధీరుం
     డేవెంటను విహరించునొ
     యావెరవున సంచరింపు మర్కకులేశా.110
గీ. ఇచ్ఛ లేకయ రత్నంబు లెట్లు వెలుగు,
     ఘటపటాదులు నెబ్భంగిఁ గానిపించు,
     నట్ల యణుమాత్ర మగుపరమాత్మునందు
     జగము లన్నియుఁ దనలోన సంచరించు.111
గీ. కణఁగి యాత్మయందుఁ గర్తృత్వమును నక
     ర్తృత్వమును వెలింగి తోఁచుచుండు.