పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


యుదయభానుప్రభ నుల్లసం బాడెడు
        మణిభూషణస్ఫూర్తి మాఱు మలసి,
పర పైనవెన్నెలనురువుల పోలికఁ
        దనరారు ధవళవస్త్రములు గట్టి,


గీ.

మానినీకరచామర మరుతచలిత
కుంతలుం డయి తగ నిండుకొలువునందుఁ
దనువుఁ గీర్తియుఁ గల పుష్పధన్వుఁ డనఁగఁ
జూడ నొప్పారు ముప్పయక్షోణివిభుఁడు.

38


మ.

అనిలో రాయగజేంద్రసింహ మగుముప్పాధీశు చే భగ్ను లై
చని, స్వప్నంబున నవ్విభుండు వెలయన్ శంకించినన్ మోస మౌ
నని చింతించి, నఖాంకురాంకుశవినోదాసక్తి నిద్రింప నీ
క నివారింతురు రాజకుంజరములన్ గాంతామణుల్ కానలన్.

39


గీ.

ఆమహీవిభుచేత రామాద్రిసీమఁ
బెక్కువృత్తులు గ్రామముల్ వెలయఁ గాఁచి
యతనియాశ్రితులం దెల్ల నధికుఁ డనఁగఁ
జతురుఁ డన ధన్యుఁ డన సడిసన్నవాఁడ.

40


వ.

అట్లు గావున.

41


శా.

ఆయుశ్శ్రీశుభమోక్షదున్ హరిఁ బ్రబంధాధీశుఁ గావించి, దు
ర్మాయాదూరము నిర్వికారము సదామాంగల్యయుక్తంబు నా
మ్నాయాంతార్థవివేకసారము మనోమత్తేభసింహంబు సం
శ్రేయోమార్గము నైన బోధమయ వాసిష్ఠంబు నేఁ జెప్పెదన్.

42


వ.

అదియును వాల్మీకిమునిప్రణీతంబును, వసిష్ఠవిశిష్టవాగ్విలాసభాసు
రంబును, రామచంద్రకథాప్రధానంబునుం గావున, వాసిష్ఠరామాయ
ణం బనంబడు. ఇప్పురాణవాక్యరత్నోపహారంబులు పురుషోత్తమున
కిచ్చుట యదియు నొక్కయారాధనవిశేషం బగుటం జేసి -

43