పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/213

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాక్షసేంద్రులనగరంబు లంబాఖ్యమౌ శైలంబుదక్షిణస్థలిఁ బ్రవేశ
పురమును బశ్చిమంబున దేవసిద్ధాదిపురములు మెఱయు నాధరణిధరము
శిరసుపై దివ్య మగుసోమశిల వెలుంగు, నందుఁ బ్రతిపర్వమున సోముఁ డవతరించు
బ్రహ్మ యాకొండ యుత్తరపార్శ్వమందు, నుండు నొకచోట సాకృతి నుండు వహ్ని.

146


మ.

కనకక్షోణిధరంబునుత్తరమునం గాంతి న్వెలుంగున్ ద్రిశృం
గనగం బగ్గిరితూర్పుశృంగమున వేడ్క న్నిల్చు నారాయణుం
డనఘుం డబ్జభవుండు మధ్యశిఖరంబం దుండు విశ్వాంతరా
త్మ నవీనేందుకళాధరుండు మెలఁగుం బాశ్చాత్యకూటంబునన్.

147


క.

ఇంగిలికము మణిశిలయున్, రంగుగ వైడూర్యరత్నరాజియుఁ దనలో
నం గలత్రిశృంగనగమున, సంగడి శోభిల్లు యక్షసాధ్యపురంబుల్.

148


క.

ఈసరవి సిద్ధలోకా, వాసము లగుకేసరాద్రివర్గంబులచే
భాసిల్లుమెఱుపుగర్ణిక, గా సరసిజలీలఁ బృథ్వి గడు నొప్పారున్.

149


వ.

ఈభూగోళప్రకారంబు సకలపురాణసాధారణం బిటమీఁద నదుల నామధేయం
బులు జన్మంబులు నెఱింగించెద వినుండు మొదల సోమాఖ్యం బగునాకాశసము
ద్రంబువలన నాకాశగామిని యగునది యుదయించె నది యింద్రగజక్రీడాస్థానంబై
చతురశీతిసహస్రయోజనోన్నతం బైన మేరువునకుఁ బ్రదక్షిణంబు చేయుచు నమ్మే
రునగోన్నతశిలలవలన జాఱి నాలుగుపాయలై యఱువదివేలయోజనంబులు నిరా
లంబనంబునఁ బ్రవహించుచు సితాలకానందాచక్షుర్భద్రాభిధానంబులు నాలుగు
ధరియించి యనేకసహస్రముఖప్రవాహంబుల భూధరంబులు వ్రక్కలించుచు
ముప్పదివేలయోజన౦బులనిడుపునం గేతుమాలవర్షంబున గంగ యనుపేరం బ్రవ
హించుచుండు నింక గంధమాదనపార్శ్వంబున నేకత్రింశత్సహస్రయోజనప్రమా
ణంబునం బ్రవహించువరగండిక వర్ణించెద వినుండు.

150


ఉ.

ఆవరగండికాతటములం దిరువంకలఁ గేతుమాలదే
శావళి యొప్పు నందుఁ గలయంగన లుత్పలమేచకాకృతుల్
పూవిలుకానిఁ బోలుదురు పూరుషు లందఱు కృష్ణవర్ణు ల
ప్పావనభూమిలో నిలుచుఁ బాయక బ్రహ్మసుతుండు నెమ్మదిన్.

151


క.

ఇది చిత్ర మచటిపనసల, మదిరినషడ్రసఫలాళిమధురససేవన్
ముదిమియుఁ దెవులును నెఱుఁగక, పదివేల్సంవత్సరములు బ్రతుకుదురు ప్రజల్.

152


సీ.

మాల్యవద్గిరిపార్శ్వమహిఁ బూర్వగండికానది ప్రవహించు ముప్పదియునొక్క
వేలయోజనములవిరివి నన్నదితటస్థలముల భద్రాశ్వజనపదములఁ