పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/175

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నావహించి పదద్వయంబు గంభీరాఖ్యం గటితటి సుభగాహ్వఁ గడుపు దేవ
దేవాహ్వయంబునఁ ద్రిణయనసంజ్ఞ నాననము వాచస్పతినామధేయ
మున శిరము రుద్రనామకమున సమస్త, తనువుఁ బూజించి తత్పురస్థలమునందుఁ
దేనెయును గోఘృతంబును దిలలు మేళ, వించి సౌభాగ్యపతయే యటంచు వేల్చి.

59


క.

క్షారము రసమునుఁ జమురునుఁ, గోరంతయు నాసపడక గోధూమమయా
హారములఁ జేయవలయుం, బారణ ధరణితలంబె పళ్ళెము గాఁగన్.

60


గీ.

యావకోదన మాషాఢ మాది యైన, నెలలు నాల్గింటఁ గార్తికాదులను మూటఁ
జామయిగిరికఁ బారణఁ జలిపి మాఘ, శుక్లపక్షతృతీయ వచ్చుటయు నాఁడు.

61


శా.

క్ష్మానాథోత్తమ పార్వతీగిరిశులం గానీ రమావిష్ణులం
గానీ యోపినపాటిబంగరువునం గావించి నేమంబునం
దానం బీఁ దగు దేనె నేయి గుడుముం దైలంబు సాముద్రమున్
ధేనుక్షీరము నున్నపాత్రములతో దేవద్వయప్రీతిగన్.

62


క.

ఈసువ్రతంబు నియతిం, జేసిన మగవారి కైనఁ జెలువల కైనన్
శ్రీసౌభాగ్యంబు లనా, యాసంబున సంభవించు నంటవు భవముల్.

63


వ.

వాంఛితసఫలతాలతావితానోపఘ్నంబును సకలకలుషోపన్నంబు నైనవిఘ్నవ్రతం
బు వినిపించెద ఫాల్గునంబు మొద లైననాల్గుమాసంబులం జవితిచవితిని నియతుం
డై శూరవీరగజాననలంబోదరైకదంష్ట్రాధానంబులం జతుర్యంతంబుగా వినా
యకునిం బూజించి తిలాన్నంబున హోమంబు సలిపి నక్తంబు గావించి మఱు
నాఁడు పారణయుం జేయవలయు నైదవమాసంబున యథాశక్తి భర్మనిర్మితవినా
యకప్రతిమం బాయసతిలపూరితపంచపాత్రంబులతోడం గూడ దానం బొసంగవల
యు నిమ్మహావ్రతంబు నడిపినపుణ్యులకు నిరంతరంబును నిరంతరాయంబున మనో
రథంబులు సిద్ధించు.

64


సీ.

మున్ను దేవేంద్రుండు మ్రుచ్చిలించినయజ్ఞతురగంబు సగరభూవరుఁడు గనియె
నాకసంబునఁ బాఱురాకాసులపురాలు ఫాలలోచనుఁ డవలీల గెలిచె
పతగేంద్రుఁ డమరపాలితసుధాకలశంబు సాధించి తల్లిదాస్యంబు మాన్పె
నేను నభ్రంకషం బైనవారిధి నిమిషంబులో నాపోశనంబు గొంటి
మఱియు నాదిమరాజులు మత్తవెరి, రాజి ఘోరాజిపీమఁ బరాజితంబు
చేసి నిష్కంటకంబుగా నాసముద్ర, భూమి యేలిరి యీనోము నోమి కాదె.

65


క.

క్షితినాయక విను శాంతి, వ్రత మిఁకఁ గార్తికము మొదలు వర్షావధిగాఁ
బ్రతిశుక్లపక్షపంచమి, నతినియమముతోడ రాత్రి హరి నహిళయనున్.

66