పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/37

ఈ పుట ఆమోదించబడ్డది

ఒక చక్రవర్తి చిత్రీకరించబడిన శిల్పం

ఈ శిల్పంలో ఒక చక్రవర్తి అంజలి ముద్రతో నిలబడి వుండటం గమనించవచ్చు. ఆయనకు ఇరువైపుల ఇద్దరిద్దరు చొప్పన నలుగురు సేవకులు - ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు, తమ కుడి చేతుల్లో వింజామరలను ధరించి ఉన్నారు.

సిద్దార్ధుని మహాభినిష్క్రమణదృశ్యాన్ని చిత్రీకరించిన సున్నపురాతి కుడ్యం

ఈ అమూల్య శిల్పం యువరాజు సిద్దారుడు కపిలవస్తులోని తన భవనం వదిలి, తాత్విక జిజ్ఞాసతో నిష్క్రమించి, బుద్ధుడుగా మారటం వివరిస్తుంది. అతను ప్రత్యక్షంగా కన్పించకపోయినా, బుద్ధుని ప్రతీకగా గుర్రం మీద ఛత్రంతో బాటు రాజభవన తోరణ ద్వారం దాటుతున్న కంటకాశ్వం కన్పిస్తాయి.

ఇటువంటి సంప్రదాయిక తోరణాలు ఆ రోజుల్లో ప్రవేశ ద్వారాలుగా ఉండేవి. ఇవి దారు నిర్మితాలయి ఉండవచ్చు. ఈ విధానం బౌద్ధ స్తూపాలలో చాలా చోట్ల కన్పిస్తుంది. ఇప్పటికీ కనిపిస్తున్న స్థూపాల తోరణం ద్వారాలు కూడా ఇదే విధంగా కట్టబడి ఉన్నాయి.

బుద్ధ పాదాలు చిత్రీకరించబడిన శిల్పాలు

ఇది క్రీ.శ. 1వ శతాబ్దికి చెందింది. ప్రారంభ బౌద్ధ శిల్పాలలో బుద్ధుడిని మానవాకారంలో చూపలేదు. ఆయనను ఏదో ఒక చిహ్నం ద్వారా సూచించేవారు. అమరావతికి చెందిన ఈ శిల్పంలో బుద్ధుని పాదాలు చూపడం ఆ విధానంలో భాగమే.

బుద్దుని జ్ఞానోదయం, మహాస్థూపం

ఈస్తూపానికి రెండు వైపులా వివిధ కాలాలలోని చెక్కడాలున్నాయి. సుమారుగా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దికి చెందినది మొదటి చెక్కడం. బుద్ధునికి జ్ఞానోదయమైన పిమ్మట ఆ ప్రదేశంలో ఒక పురుష బృందం అతని బోధనలు వినే దృశ్యం దీనిలో ఉంది. స్తూపం రెండవ వైపు క్రీస్తు శకం 8వ శతాబ్దం