పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

రామేశ్వరమాహాత్మ్యము


కవితసత్కార మొప్పఁగ గారవించి
పలికె గంభీరభాషణప్రౌఢి మెరయ.

22


క.

నిర్మలకీర్తివి సత్కృతి
నిర్మాణవిశారదుఁడవు నిర్మలఛందో
మర్మజ్ఞుఁడవు శివార్చన
ధర్మపరుండవు నుతింపఁ దరమే నిన్నున్.

23


వ.

మదీయవిజ్ఞాపనం బవధరింపుము సపాదలక్షగ్రంధసంఖ్యాసమేతంబును పంచాశ
త్ఖండమండితంబును, బహుసంహేతోసమాకీర్ణంబునునై యొప్పు స్కాందంబను
నాదిమపురాణంబునందు సేతుఖండంబు శ్రీరఘుపతి ప్రతిష్ఠిత రామేశ్వరస్వామి
మహాత్మ్యసమ్యుక్తం బగుటంజేసి రామేశ్వరపురాణం బనంబరగునది యాంధ్రదే
శభాషచేతం బ్రబంధంబు గావించి మదీయకులదైవతం బగు శ్రీగురుజానపల్లి మ
ల్లేశ్వరస్వామిపేర నంకితంబు సేయుము. దీనివలన మాకును మీకును శాశ్వ
తకీర్తియు సకలాభ్యుదయంబులు సిద్ధించునని బహుప్రకారంబులం బ్రార్ధించె
నయ్యవసరంబున.

24


ఉ.

రాజమహేంద్రదుర్గరుచిరంబుగ దేశమునం బ్రసిద్ధిచే
భ్రాజిలు గాకినాడ శలపాకమహాళ్ళకు రెంటికిన్ మహా
తేజ మెలర్ప నాస్థలపతిత్వముఁ గాంచినదిట్ట శాశ్వత
శ్రీజయశాలి వైరిగజసింహము నండురికామమంత్రియున్.

25


వ.

నన్నుంజూచి లక్ష్మణకవీంద్రా మల్లనమంత్రి విన్నవించిన వచనంబు
లాదరించి ప్రబంధంబు రచింపుమని వినయపూర్వకంబుగా భా
షించిన నంగీకరించితి నంతట బహుమానంబుగాఁ గర్పూరతాం
బూల జాంబూనదాంబర మణిమయాభరణ హిరణ్య ధరణ్యాది
మహాపదార్ధంబు లిచ్చి మల్లనమంత్రి నన్నుం బూజించి వీడుకొల్పి
నం జనుదెంచి విరించిముఖనిఖిలబృందారకబృంద మహనీయ హా
టకకోటీర ఘటిత మణిగుణ ప్రభాంకూర నీరాజిత చరణార