పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/6

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

5


సీ.

ఏవదాన్యుని కులదైవంబు గురుజాన
        పల్లిమల్లేశుండు భవ్యమూర్తి
యేమంత్రి తాత భూమీశసంపద్గుణ్య
        మహిమోన్నతుఁడు చెన్నమల్లమంత్రి
యేమహాత్ముని తండ్రి యిందుచందనకుంద
        బృందనిర్మలకీర్తి భీమమంత్రి
యేధన్యు తల్లి ధాత్రీధరాధిపసుతా
        కలితసౌభాగ్యవిఖ్యాత సీత


గీ.

యేమహాత్ముని సోదరుం డీశ్వరాంఘ్రి
పూజనాసక్తిమతి సింగరాజు శౌరి
యతఁడు శ్రీభద్రిరాజువంశాధికుండు
మహితగుణశాలి మల్లనమంత్రిశౌరి.

20


వ.

ఒక్కనాడు వివిధవిద్వజ్జనపరివృతుండై నిజాస్థానభవనంబునం గొలువు దీర్చి
కూర్చుండి సప్తసంతానప్రముఖనిఖిలధర్మరహస్యసమాకర్ణనసముదీర్ణసకుతూ
హలాయత్తచిత్తంబున.

21


సీ.

శోభితాపస్తంబసూత్రు వాధూలస
        గోత్రు సమస్తసద్గుణసమేతు
నేనుఁగ లచ్చకవీంద్రునిపౌత్రుని
        శ్రీమాచిరాజు నృసింహమంత్రి
దౌహితృభూవరాస్థానపూజితుఁడు తి
        మ్మనమంత్రికినిఎ బేరమకుఁ దనూజు
ధన్యు ననంతప్రధానసోదరు వీర
        మంత్రి కగ్రజు రాజమాన్యచరితు


గీ.

నన్ను మతిమంతు లక్ష్మణనామధేయు
నమరఁ బిలిపించి యుచితాసనమున నునిచి