పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రామేశ్వరమాహాత్మ్యము


పలికె నోదేవ నీభక్తునివిన్నప
        మవధరింపుము వీరులైన యన్య
మనుజేశులును సేతుమార్గంబువలన లం
        కకు వచ్చి పీడింపఁగలదు గానఁ
జెలఁగి ధనుష్కోటి చేసెడు భేదనం
        బాచరింపుము కరుణార్ద్రచిత్త


గీ.

అనుచుఁ బ్రార్థింప గాకుస్థుఁ డట్ల చేసె
నందువలన ధనుష్కోటి యయ్యె దాని
దర్శనంబున జంతుసంతతికి ముక్తి
గలుగు నవగాహఫల మేమొ తెలియ రామ

122


గీ.

రావ కరచాపకోటినిర్దళితసేతు
రేఖ కైలాసమునకు విరించిలోక
మునకు వైకుంఠపట్టణంబునకు స్వర్గ
మునకుఁ దెఱు వది తాపసముఖ్యులార.

123


వ.

మఱియు బ్రహ్మవిష్ణుమహేశ్వరులును, వాణీలక్ష్మీపార్వతులును,
వసురుద్రాదిత్యవిశ్వమరుదశ్వగంధర్వకిన్నరకింపురుషాదులును
పితృదేవతలును, దశకోటితీర్థగణంబులతోడ ధనుష్కోటితీ
ర్థంబున సన్నిహితులై వసింతురు. దేనమునిగంధర్వాదు లందుఁ
దపంబుఁ గావించి మహాసిద్ధిం జెందిరి. తజ్జలంబులం బితృదేవతాత
ర్పణంబు సేయువారు సర్వపాపముక్తులై సత్యలోకంబునం బూజ
నొందుదురు. భక్తిపూర్వకంబుగా నచ్చోట నొక్కభోజం బిడి
నవారికి అనంతఫలంబు సంభవించు. రేవాతీరంబునం దపంబును,
గంగాతటంబున మరణంబును, కురుక్షేతంబున దానంబును, మ
హాపాతకంబుల నశింపఁజేయు. ఏతత్రయంబును ధనుష్కోటి
యందుఁ బాప్తంబయ్యెనేని ముక్తి నొసంగు. సకలాభీష్టంబులు సి
ద్ధించు. ధనుష్కోటిస్నానం బేకవారంబైన నాచరించినవారికి సి