పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రామేశ్వరమాహాత్మ్యము


కభాగావశిష్టంబగు హత్యాపాపంబుతోడ గంధమాదనంబునకుం
జని శివతీర్థసేవఁ జేసి నిశ్శేషనష్టపాతకుం డయ్యె. నిది శివతీర్థ
ప్రభావంబు. శంఖుండను ముని మున్ను గంధమాదనంబునం దపం
బు సేయుచు స్నానార్థం బచ్చోట నొకతీర్థంబు గల్పించె. న
ది యతనిపేర శంఖతీర్థం బనందగె. తల్లిదండ్రుల నవమానించు
వారునుం గృతఘ్నులును నందొకమారు తానంబుఁ జేసి ముక్తుల
గుదు. రిది శంఖతీర్థమహిమ. చైర్వుండు సంయుగ్వంతుండు,
రైక్వుండు ననుపర్యాయనామంబుల నెగడిన మునివరుండు గం
ధమాదనగిరియందుఁ దపంబు సేయుచుం దనమంత్రబలంబున నచ్చో
టికి గంగాయమునాగయాతీర్థంబుల నాకర్షించి యందు న
భిషవం బొనర్చె. నమ్మహాయోగిప్రసాదంబున నజావశ్రుతియను రా
జు తత్తీర్థత్రయాభిషేకంబుఁ జేసి శుద్ధచిత్తుండై ముక్తిం జెందె. ని
ది యమునాగంగాగయాతీర్థవైభవంబు. రాఘవుండు గంధ
మాదనంబున శివలింగంబు నిల్పి ధనుష్కోటిచేత భూతలంబు భేదిం
చి తద్వివరనిర్గతగంగాతోయంబుల రామేశ్వరు నభిషేకించె.
దానివలన గోటితీర్థం బయ్యె. నందు స్నానంబుఁ గావించి
గంధమాదనంబున నిల్వక తైర్థికుండు మగుడవలయు. నది సకల
తీర్థరాజం. బిది కోటితీర్థమాహాత్మ్యంబు. పురూరవుండను చ
క్రవర్తి సాధ్యామృతసేవఁ గాంచి యూర్వశీసంభోగసుఖంబు ల
నుభవించె. నందు నఘమర్షమాత్రంబున యజ్ఞదానతపోబ్రహ్మ
చర్యాదులవలనం గలుగు సుగతి లభించు. దానిమహిమంబు తొ
లి సనకాదులకుఁ జతుర్ముఖుండు వివరించె. నిది సాధ్యామృతవైభవం
బు. భృగువంశజుండయిన సుచరితుం డనుముని జాత్యంధుండు గావు
నఁ దీర్థయాత్ర సేయ శక్తుండుగాక గంధమాదనంబున శంకరు
నుద్దేశించి తపంబుఁ జేసె. నంత నమ్మునికిఁ బ్రత్యక్షంబై శివుండు వరం
బు వేఁడు మనిన సర్వతీర్థస్నానంబు సేయుట నా కభిమతంబని వి