పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


బ్రహ్మహత్య నశింపఁజేసె. నాతీర్థంబు రోగదారిద్ర్య మహా
పాపకనాశనం. బిది లక్ష్మణతీర్థమహాత్మ్యంబు. రావణుం ద్రుంచి
రాఘవుం డేతీర్థతోయంబున జతక్షాళనంబుఁ జేసె నది జటాతీ
ర్థం బయ్యె. నం దవగాహంబు సేయువారికిఁ జిత్తశుద్ధి సిద్ధించునని
రాఘవుండు వరం బిచ్చె. వరుపుత్త్రుండు భృగుండును, వ్యాససు
తుండు శుకుండును, గురూపదేశంబునం జేసి వచ్చి తజ్జలంబులం
దోఁగి చిత్తశుద్ధి వడసిరి. తజ్జలావగాహమాత్రంబున మనశ్శుద్ధి సం
భవించు. నిది జటాతీర్థాతిశయంబు. తొల్లి కుబేగుం డేతీర్థంబు సేవిం
చి నిధీశ్వరుం డయ్యె నది లక్ష్మీప్రదంబగుట లక్ష్మితీర్థంబున విఖ్యాతి
నొందె. నందుఁ గృతస్నానుండై నలకూబరుండు రంభాసంభోగం
బుఁ గాంచె. ధర్మజుండునుఁ గృష్ణోపదేశంబున నిమజ్జనం బాచరిం
చి పుణ్యవైభవంబువ దిగంతంబులు గెల్చి రాజసూయం బనుష్ఠించి
చక్రవతి యయ్యె. ఇది లక్ష్మీతీర్థసముత్కరంబు. రావణవధానంత
రంబున రాఘవుండు సురమునివానరసమేతంబుగా సేతుమార్గం
బున గంధమాదనంబునకు వచ్చి సీతాశోధనార్థం బెచ్చోట నగ్నిదే
వు నావాహనంబుఁ జేసె నాప్రదేశం బగ్నితీర్థం బయ్యె. నది మహా
పాతకశోధనంబునుం బిశాచత్వాదిమోచకంబును మహాతీర్థం
బను నిది యగ్నితీర్థప్రశంస. పూర్వకాలంబున గంధమాదనశై
లంబున సుదర్శనచక్రంబుఁ గూర్చి యహిర్భుధ్నుం డనుమహర్షి త
పంబుఁ జేసె. నది సహించక రాక్షసు లతని బాధించినఁ దచ్చక్రంబు
వారిం ద్రుంచి మునిరక్షణకొఱకు నిరంతరంబు నేతీర్థంబున ని ల్చె
నది చక్రతీర్థనామంబుఁ బూనె. నిందుఁ గ్రుంకినవారికి గోర్కు
లు లభించు. అంధమూకబధిరత్వాదివైకల్యంబు దొలంగు. నిది చ
క్రతీర్థఘనత్వంబు. జగత్కర్మృత్వాహంకారదూషితుం డగున
జుని పంచమముఖంలు భేదించి శివాంశభవుండు భైరవుండు హ
త్యాదోషనివృత్తికై సర్వతీర్థంబులు సేవించి కాశికిం బోయి యే