పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రామేశ్వరమాహాత్మ్యము


శ్రౌతస్మార్తకర్మంబులుఁ బూజలుఁ గలుగునని చెప్పె. నట్లు బహుయ
జ్ఞంబు లనుష్ఠించి పరమేష్ఠి కృతార్థుం డయ్యె. నయ్యాగస్థలంబు బ్ర
హ్మకుండం బనం బరగె. అందు నఘమర్షణం బొనరించువారును
దత్కుండభసితంబు ధర్మసఖుం డను రాజుపుత్త్రకుండై గురూ
పదేశంబువ సేతువునకుం జని హనూమత్కుండంబుఁ జేరి తీరంబు
నం బుత్త్రకామేష్టి యాచరించి శతభార్యలయందు శతపుత్త్రు
లం బడసి చిరకాలంబు రాజ్యంబు పాలించి పుత్త్రులకు రాజ్యం
బు విభజించి హనూమత్కుండంబుఁ జేరి సభార్యుండై తపంబు జే
సి శివసాయుజ్యంబుఁ గాంచె. నిది హనూమత్కుండప్రభావంబు.
కక్షవంతుండను తాపసుఁడు తొల్లి యుదంకుసన్నిధి సాంగవే
దాధ్యయనంబుఁ జేసి తదుపదిష్టప్రకారంబున గంధమాదనంబున
కేగి అగస్త్యతీర్థంబునం బ్రత్యహంబు స్నానంబు సేయుచు మూఁ
డేం డ్లుండి యంతం దత్తీర్థజలవినిర్గతం బైన చతుర్దంతగజంబు లెక్కి
యమ్మునికుమారుండు మధురాపతియైన స్వనయభూపతిం గాంచి,
యతనిచేత నభినందితుండై యారాజకన్యక మనోరమ యనుదా
నిం బెండ్లియై గృహస్తధర్మంబు లనుష్ఠించె. నిది యగస్త్యతీర్థవైభ
వంబు. కుంభసంభవుని శిష్యుండు సుతీక్ష్ణుండు రామమంత్రో
పాసకాగ్రేసరుం డయ్యెఁ. దత్తీర్థతటంబున రామచంద్రుండు శివ
లింగంబు నిల్పి లోకానుగ్రహార్ధంబుఁ బూజించె. నాసరోవ
రంబునం గృతమజ్జనుండై ధర్మజుం డనృతవచనదోషనిర్ము
క్తుండై రాజ్యంబుఁ బాలించె. నిది రామతీర్థప్రభావంబు. బలభ
ద్రుందు నైమిశారణ్యంబునకుం జని మునులకు నిఖిలపురాణకధలు
వచింపుచున్న సూతుం బ్రమాదంబున వధించి యోగబలంబునం బు
నరుజ్జీవితుం జేసి దోషనివృత్తికై గంధమాదనంబునకుం జని లక్ష్మణ
వినిర్మితం బగుతీర్థంబున మునింగి లక్ష్మణేశ్వరలింగంబు దర్శించి