పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


బుల నశింపఁజేయుటఁ బాపవినాశం బన నొప్పె. రాఘవప్రత్యయా
ర్థంబు సీతామహాదేవి వహ్నిప్రవేశంబుఁ జేసి వెడలి వేల్పులు వొగ
డ నొక్కతీర్థంబు నిర్మించి యందు స్నానంబుఁ గావించె. దానివలన
నాతీర్థంబువకు సీతాసరం బనునామంబు గలిగె. నందుఁ గృతాభిషే
కుండై పాకశాసనుండు బ్రహ్మహత్యావిముక్తుం డయ్యె. నిది సీతాస
రోమహిమంబు. మనోజవుం డనురాజు పాపకర్మవశంబున రాజ్య
భ్రష్టుండై యడవులం బడి యిడుములపాలై పరాశరహితోపదేశం
బున సేతువుఁ జేరి మంగళతీర్థంబున మాసత్రయంబు గ్రుంకి మహా
నుభావుండై రిపులం ద్రుంచి యిష్టరభోగంబులు భుజించి శరీరాంతం
బునం గైవల్యంబుఁ గాంచె. నందు సీతారాములు లోకరక్షార్థంబు స
న్నిహితులై యుందురు. సర్వమంగళకారణం బగుట నిది మంగళతీ
ర్థం బయ్యె. హిమవత్పార్శ్వంబున నగస్త్యభ్రాత భూతేశుం గూర్చి
తపంబు జేసినం బ్రత్యక్షంబై విరూపాక్షుండు ముముక్షుండగు
నమ్మునిం జూచి సేతుమధ్యంబున మంగళతీర్థంబుసన్నిధి నొక్కమ
హాతీర్ధంబుఁ గలదు. దానియందు స్నానంబు సేయుము. ముక్తిం బాొం
దెద వని బోధించె. నతం డట్ల యేఁగి మూడేండ్లు స్నానంబుఁ గావించి
యంత ముక్తిం జెందె. అగస్త్యభ్రాత యమృతుండైన కారణం
బున నది యమృతవాపి యయ్యె. తొల్లి బ్రహ్మవిష్ణులకుఁ గలహం
బు జనించె. నయ్యిద్దరినడుమ నొక్కజ్యోతిర్మయలింగం
బుద్భవించె. దానియాద్యంతంబులు చూచినవాఁడ జగత్కర్త య
గునని సమయంబుఁ గావించి హంసవరాహరూపంబులు ధరించి
వారు చని. రందు గోవిందుండు మరలివచ్చి చూడనైతి నని సత్యంబు ప
లికె. నలువ వచ్చి లింగంబుతుదఁ జూచితి నని యనృతంబు పలికె. నది
సహింపక యపూజ్యుండవు గమ్మని విధికి శాపం బిచ్చి నంత బ్రహ్మ
దేవుండు శివుని బ్రార్థించిన బ్రసన్నుండై గంధమాదనపర్వతమం
దు యాగంబు సేయుము. దీన నీకు మిథ్యావాదదోషంబు నశించు