పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

రామేశ్వరమాహాత్మ్యము


స్త్యతీర్థంబును, రామతీర్ధంబును, లక్ష్మణతీర్థంబును, జటాతీర్థం
బును, లక్ష్మీసరంబును, అగ్నితీర్ధంబును, చక్రతీర్థంబును, శివతీ
ర్థంబును, శంఖతీర్థంబును, యామునతీర్థంబును, గంగాతీర్థంబును
గయాతీర్థంబును, కోటితీర్ధంబును, సాధ్యామృతంబును, మాన
సంబును, ధనుష్కోటితీర్ధంబును, సేతుమధ్యగతంబులై ప్రకాశిం
చు. వీని లక్షణంబులు వివరించెద. గాలవుం డను మునీశ్వరుఁ
డు విష్ణుపూజాపరుండై దక్షిణతీరసముద్రతీరంబున దపంబు సే
యుచు నొక్కనా డొక్కరక్కసునిచేతం జిక్కుపడి కావవే
యని హరిం బ్రార్తించిన హరిప్రేరితంబై సుదర్శనచక్రం బారక్క
సుం దునిమి యమ్ముని కొనియాడ నేతీర్ధంబున సన్నిహితంబై యుం
డె నది చక్రతీర్ధం బనంబరగె. దానిం దలంచినవారికి గర్భవాసంబు
గలుగనేరదు. సుదర్శనుండను విద్యాధరసుతుండు గాలవముని
కన్యకం గాంతిమతియనుదానిం చూచి కామమోహితుండై కేశాక
ర్షణంబుఁ జేసిన నమ్ముని యలిగి భేతాళత్వంబుఁ జెందుమని శపించె.
నతం డట్ల భేతాళుం డయి కొంతకాలంబు పరిభ్రమించి పుణ్యవశం
బున సేతువుకుం జని చక్రతీర్థసమీపంబునం గల యొకతీర్థంబు
తటంబున నిల్చి తజ్జలశీకరిస్పృష్టగాత్రుండై శాపమోక్షంబు నొంది
దివంబునకుం జనియె. నది భేతాళవరదం బయ్యె. తొల్లి దృఢమతి
యనుశూద్రునకు వైదికకర్మోపదేశంబునం జేసి సుమతి యనువిప్రుం
డు చిరకాలంబు నరకంబు లనుభవించి నీచయోనులం బుట్టి క్ర
మంబున బ్రాహ్మణుం డయి జనించి బ్రహ్మరక్షాబద్ధుం డయ్యె. తద్భే
దంబు సహించక యతనితండ్రి యగస్త్యునిశర ణొంది యాముని
చెప్పినచొప్సున సేతువునకుం బోయి తనపుత్త్రు నొక్కతీరంబున
ముంచె. నందువలన నతండు రక్షోముక్తుం డయ్యె. నాశూద్రుండు
ను బెద్దకాలంబు నరకంబు లనుభవించి గృధ్రంబై పొడమి యొక్క
నాడు తత్తీర్థజలపానంబుఁ జేసి పాపముక్తుం డయ్యె. నిట్లు పాపం