పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33


గీ.

రూఢి రఘుపతిచేత నారూఢమైన
నలవినిర్మితసింహాసనంబు గాంచి
మ్రొక్కు నెవ్వాఁడు పులకితమూర్తి యగుచు
నతనికి లభించు మోక్షసింహాసనంబు.

113


గీ.

తనరుఁ బడమటికోణంబు దర్భశయ్య
తూర్పుకోణంబు మెెఱుఁగుడు దుర్గపురము
సేతుమూలంబు లని రెండుఁబాతకార్తి
భంజనసమర్థములు మహాపావనములు.

114


క.

సీతారామునిఁ బరమ
జ్యోతిర్మయు నాత్మ దలచుచు న్మున్నుగ వి
ఖ్యాతశుభహేతువునకున్
సేతువుకు నరులు బ్రణుతి సేయఁగవలయున్.

115


శ్లో.

రఘువీరపదన్యాస పవిత్రీకృతపాంసవే
దశకంఠశిరచ్ఛేద హేతవే సేతవే నమః.


శ్లో.

సేతవే రామచంద్రస్య మోక్షమార్గైకహేతవే
సీతాయామానసాంభోజ భానవే సేతవే నమః.

117


క.

అనుమంత్రములు పఠించుచు
మునుపుగఁ దైర్థికులు సేతుమూలంబుఁ గనుం
గొని సాష్టాంగనమస్కృతు
లొనరింపఁగవలయు భక్తియోగముపేర్మిన్.

118


వ.

ఈప్రకారంబున శ్రీరామునిచేత నిర్మితంబగు సేతుబంధంబున ననే
కకోటితీర్థంబులు గలవు. వానినామంబులు, సంఖ్యయును వాకృ
చ్చి వర్ణింప శేషండును సమర్ధుండు గాఁడు. చతుర్వింశతితీర్థంబు
లు ప్రధానంబులై యుండు. చక్రతీర్థంబును, బేతాళవరదంబును,
పాపవినాశనంబును, సీతాసరంబును, మంగళతీర్థంబును అమృ
తవాపియు, బ్రహ్మకుండంబును, హనూమత్కుండంబును, ఆగ