పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


పంచామృతస్నానభవ్యకృత్యము దీర్చి
        గంధం బలంది యక్షతము లొసఁగి


గీ.

లలితదూర్వాంకురంబులు నలినకుముద
చంపకాశోకపున్నాగజాతివకుల
పాటలాదిప్రసూనము ల్బత్తి నొసఁగి
ధూపముల దీపములను సంతుష్టి సలిపి.

103


అనంతరంబ జంబూ రంభా కపిత్థ ఖర్జూర పనస నారికేళ బదరీ
చూతఫల పుండ్రేక్షు గోక్షీర ద్రాక్షారసక్షౌద్రఘృతపాయసమోదు
కాపూప బహువిధభక్ష్యసమన్వితమహోపహారంబులు సమర్పిం
చి సకలోపచారంబుల సపర్య గావించి యనేకప్రకారంబులం
గైవారంబు లొనర్చి గణపతిం బ్రసన్నునిం జేసి.

104


గీ.

అంత మిథిలేశకన్యకాప్రాణనాథుఁ
డచటనున్న మహాదేవినాదిశక్తి
మహిషదానవమర్దిని మహితచరిత
నధికభక్తినిఁ గొల్చి తదాజ్ఞ వడసి.

105


క.

వాణీపతిముఖసురసం
త్రాణైకధురీణమైన తనహస్తమునన్
క్షోణీనాథుఁడు నవపా
షాణస్థాపనముఁ జేసె జలనిధిలోనన్.

106


క.

ఈరీతి సేతుబంధ
ప్రారంభముఁ జేసి రామభద్రుఁడు దవ్వ
త్తీరంబునవల రచితమ
హారమ్యసుభద్రపీఠికాసీనుండై.

107


సీ.

బలవంతు లైనట్టి ప్లవగవీరులఁ జూచి
        సేతునిర్మాణంబు సేయుఁ డనిన