పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

రామేశ్వరమాహాత్మ్యము


గీ.

శిల్పి సమ్మతుఁ డధికుఁ డనల్పబలుఁడు
హరికులశ్రేష్ఠుఁ డతఁడు నాయందు వైచు
తృణశిలాదారుబృంద మొద్దిక ధరింతు
నదియు దృఢముగ సేతువై యమరియుండు.

98


క.

ఆసేతుమార్గమున సే
నాసహితుఁడవై నిశాటనాథునిపురి క
బ్జాసనవందిత చనుమని
యాసాగరుఁ డరిగె నంత నంతర్హితుఁడై.

99


ఉ.

అంతట జానకీరమణుఁ డంచితబాహుబలున్ నలున్ దృఢ
స్వాంతునిఁ జూచి రమ్ము కపివర్య రచింపుము సేతుబంధ మ
త్యంతదృఢంబుగా జనకునంతటివాఁడవు శిల్పశక్తి న
శ్రాంతవినిర్మలోన్నతయశంబులు జేకురు నీకు నీక్రియన్.

100


చ.

అన విని జానకీపతికిఁ బ్రాంజలియై పలికె న్నలుండు మ
జ్జనకుఁడు విశ్వకర్మ కడుఁజక్కనిమందిరశైలసీమ మ
జ్జననికి ముందు దా వర మొసంగెను మత్సమవీర్యుఁ డైననం
దనుఁడు జనించు నీ కనుచుఁ దామరసప్రియవంశదీపకా.

101


క.

ధీరుఁ డగువిశ్వకర్మకు
నౌరసపుత్త్రుఁడను శక్తి నతనికి సముఁడన్
వారక నే నిర్మించెద
పారావారమున సేతుబంధన మధిపా.

102


సీ.

అని విన్నవించిన విని యన్నరేంద్రుండు
        శుభవాసరంబున శుభముహూర్త
సమయంబునందుఁ గుంజరరాజవదను లం
        బోదరు హేరంబు వేదవేద్యు
నావాహనముఁ జేసి హారిమాణిక్యసిం
        హాసనంబున నుంచి యర్ఘ్యపాద్య