పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25


తరల.

అని పురాంతకచాపభంజనుఁ డానతిచ్చినవాక్యముల్
విని కృతాంజలులై వలీముఖవీరు లర్కసుతాదు ల
య్యనఘశీలునితోడ నిట్లని రయ్య నావలు దెచ్చి సొం!
పెనయఁ దెప్పలుగట్టి దాఁటెద మిమ్మహాలవణాంబుధిన్.

74


వ.

అప్పుడు కపిసేనలనడుమ నిలచి విభీషణుం డి ట్లనియె.

75


క.

శరధిన్ దశరథసూనుఁడు
శరణొందుట సముచితంబు సగరకృతం బీ
కరుణాలయంబు తత్కుల!
పరిపాలకుఁ డగుటఁ దోడుపడు రామునకున్.

76


సీ.

అనవుడు రఘురాముఁ డగచరవీరుల
        నాదరింపుచుఁ బల్కె ననఘులార
తెప్పలచేఁ గపు లిప్పయోనిధి నూరు
        యోజనంబులు తాఁటనోపువారె
పెక్కునావలు గల్గ విక్కపిసేనకు
        వైశ్యులగతి మనవంటివారు
కలములచే నబ్ధి గడతురే గడచునో
        నెడచేసి పగవార లిడుము సేతు


గీ.

రట్లు గావున మీయుపాయంబు నాకు
సమ్మతము గాదు మఱి విభీషణునిపలుకు
మది నింపగుచున్నది మార్గసిద్ధి
కర్థితో నిప్పయోధి నుపాస్తి సేతు.

77


గీ.

పెంపుతో నిట్లు త్రోవఁ జూపింపకున్న
ననలగంధవహత్యుజ్వలాస్మదీయ
భాసురామోఘదివ్యాస్త్రపటలమునకు
నిమ్మహోదధి గురి జేసి యే పడంతు.

78