పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


బున మరలివచ్చె యాసతి
పనిచినమానికము రామభద్రున కిచ్చెన్.

61


వ.

ఇట్లు హనుమంతుం డిచ్చిన యామాణిక్యంబుం గనుంగొని హర్ష
శోకపరవశుండై యప్పశుపతిచాపభంజనుండు సౌమిత్రిసుగ్రీవాం
జనేయనలనీలజాంబవత్ప్రముఖకపివీరులతోడంగూడి యభిజి
న్ముహూర్తంబునం బ్రయాణంబు వెడలి వివిధగిరిసరిదరణ్యంబులు
గడచి చని ముందట.

62


చ.

కనియె రఘూద్వహుండు కటకస్థలగాఢచరత్కరీంద్రసం
జనితమదప్రవాహపరిసర్పదమందసుగంధసాంద్రమున్
ఘనమణిశృంగగానకలనారతదేవవధూనిషాదని
స్వనరచనాక్రమశ్రవణచండమృగేంద్రము నమ్మహేంద్రమున్.

63


గీ

అమ్మహేంద్రధరిత్రీధరమ్ము గడచి
చక్రతీర్థంబునకు నేగి జనవిభుండు
పొసఁగ నచట వసించె నప్పుడు దశాస్యు
ననుజుఁడైన విభీషణుఁ డటకు వచ్చె.

64


వ.

నలుగురుమంత్రులతో నటకు వచ్చిన యమ్మహాత్మునిఁ జూచి సుగ్రీవు
నకు గూఢచారుండను శంక వొడమి రఘువీరుం డతని హితసము
చితచేష్ట లరసి దుష్టుండు గాఁడని తెలసి సంభావించి యవ్విభీషణు
నకు సకలరాజ్యపట్టాభిషేకంబు సేయించి రవిపుత్త్రు నట్ల మంత్రిప్ర
వరుం జేసి చక్రతీర్థంబు డాసి.

65


క.

చింతింపుచు రామమహీ
కాంతుఁడు సుగ్రీవుఁడాదిగాఁ గలకపిసా
మంతులకు ననియె నీదు
ర్దాంతపయోరాశి యెట్లు దాఁటుద మింకన్.

66


క.

జలనిధి దుస్తర మిక్కపి
బలములసంఖ్యమ్ము లేయుపాయుము మనకుం