పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రామేశ్వరమాహాత్మ్యము


రయమున నంతఃపురంబు వెల్వడి వచ్చి
        యనుజునితోడఁ గయ్యం బొనర్చ
బెట్టిదంబుగ వాలి పిడికిట సుగ్రీవుఁ
        బొడిచినఁ గడునొప్పిబడి తొలంగి


గీ.

చనియె దశరథరాజనందనునికడకు
నమ్మహీజాని సుగ్రీవునరుత నొక్క
సుమమాలిక గదియించి గుఱుతుచేసి
యపుడ పురికొల్పె వెండియు నాలమునకు.

56


వ.

ఇట్లు పురికొల్పుటయు సుగ్రీవుండు కిష్కింధాద్వారంబుఁ జేరి
భూగర్జితంబున వాలిం బిల్చి యతనితోడ బాహుయుద్ధంబు సే
యుచుండె నంత.

57


క.

చాపమున శరముఁ దొడగి మ
హీపతి నిండార దిగిచి హెచ్చిన వీర్యా
టోపమునఁ గూలనేసె భు
జాపటు విక్రమవినోదశాలిన్ వాలిన్.

58


ఆ.

అట్లు వాలి నిహతుఁ డైన కిష్కింధకు
నరిగి సకలవానరాధిరాజ్య
పట్టబద్ధుఁ డగుచుఁ బద్మాప్తనూనుఁ డు
ద్వేలహర్షజలధి నోలలాడె.

59


శా.

అంతన్ భాస్కరనందనుండు కపిసేనాన్వీతుఁడై రామభూ
కాంతాగ్రేసరుపాదసన్నిధికి వేడ్క న్వడ్చి ధీరు న్హనూ
మంతుం బిల్చి ధరాత్మజ న్వెదుక సన్మానంబుతోఁ బంపె న
త్యంతాటోపసమగ్రుఁడై యతఁడు శక్రాదుల్ నుతు ల్సేయఁగన్.

60


క.

వనరాశి దాటి లంకకుఁ
జని సీతం జూచి పవనసంభవుఁ డరయం