పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


గనుఁగొని వెస నగ్నిసాక్షికంబుగ సఖ్యం
బొనరించి వాలిం జంపుదు
నని విభుఁడు ప్రతిజ్ఞఁ జేసె నర్కసుతుండున్.

50


వ.

సీతాదేవిం దోడి తెచ్చెదనని ప్రతిజ్ఞ పలికె ని ట్లన్నరేశ్వర వానరేశ్వ
రులు సమయంబుఁ గావించి పరస్పరంబు విశ్వసించి నితాంతసం
తోషసమన్వితులై ఋష్యమూకగిరిశిఖరంబునఁ గూర్చుండి రంత.

51


క.

గిరినిభదుందిభికాయము
బరువడి రాఘవుఁడు జిమ్మె బహుయోజనముల్
చరణాంగుష్ఠనఖంబున
హరిసూనుని మదికిఁ బ్రత్యయము పుట్టుటయున్.

52


గీ

మఱియు నతనికి నమ్మిక మది జనింపఁ
గడఁకతో వింట నొకతూఁపుఁ దొడిగి సప్త
సాలములు నేలఁగూలంగ లీల నేసె
రాఘవుఁ డమోఘతరబాణలాఘవుండు.

53


ఉ.

ఆపటువిక్రమంబుఁ గని యద్భుత మంది దినేంద్రసూతి సీ
తాపతితోడ ని ట్లనియె దక్షుఁడ వీవు సఖుండ వౌటన
న్నాపురుహూతముఖ్యసురలైన జయింపఁగలేరు చిత్తసం
తాపము దీరెఁ బఙ్క్తిముఖదైత్యునిఁ ద్రుంచెద సీతఁ దెచ్చెదన్.

54


క.

అనవుడు రఘునాథుఁడు నె
మ్మనమున ముద ముప్పతిల్ల మార్తాండతనూ
జనిజానుజుసహితుండై
చనియెం గిష్కింధ కపుడు సరభసవృత్తిన్.

55


సీ.

అంతఁ గిష్కంధాగుహాముఖంబున నిల్చి
        రవిపుత్త్రుఁ డగ్రజురాకఁ గోరి
ప్రళయజీమూతంబుపగిది గర్జిల్లె నా
        ధ్వని యాలకించి యవ్వాలి గినిసి