పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

రామేశ్వరమాహాత్మ్యము


క.

సురఁ ద్రాగుమగువఁ గలసిన
పురుషుఁడు గణదేవలాన్నభోజియుఁ బతితా
న్నరతుఁడు గణకాన్నాశియుఁ
బరిహృతహోముఁడును మద్యపాయిసమానుల్.

25


క.

ఫలకందమూలదుగ్ధం
బులు మృగమదచందనక్రముకకర్పూరం
బులు రుద్రాక్షములును మ్రు
చ్చిలువారు సువర్ణహరులు సిద్దము దలఁపన్.

26


క.

వీరికి మఱియుం దక్కిన
చోరులకును సేతుతీర్థసుస్నానమునన్
ఘోరాఘములు నశించువి
చారం బియ్యెడ వలదు సన్మునులారా.

27


ఆ.

భ్రాతృభార్యఁ బుత్త్రభార్య రజస్వల
భగిని హీనవనితఁ బతివిహీనఁ
గల్గుఁ ద్రావు వెలఁదిఁ గలయువాఁ డిల గురు
తల్పగతసముండు తపసులార.

28


వ.

వీరునుం దక్కినగురుతల్పగసమానులుం దత్సంయోగులును మహా
సేతునిమజ్జనులై ముక్తిం బొందుదురు.

29


సీ.

యాగంబు సేయక నమరలోకాంగనా
        సంగమసుఖవాంఛ సలుపువారు
జ్వలనార్కులను దేవతలను పాసింపక
        కుశలంబు మదిలోనఁ గోరువారు
దిలమహీహేమతండులధాన్యదానంబు
        సేయక స్వర్గేచ్ఛ సేయువారు
సతతోపవాసనిష్ఠల దాప మొందక
        బలభేదిపురి నుండదలఁచువారు