పుట:రామేశ్వరమాహాత్మ్యము (ఏనుగు లక్ష్మణకవి).pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13


స్తాంబుసేవసంబును, నేత్రనఖసంధిసూచీప్రక్షేపంబును, నండస
హితశిశ్నంబున నయోభారబంధనంబును, వృక్షాగ్రంబువలనం
గషోదకకూపంబునం బడంద్రోఁచుటయును, తీక్ష్ణఖడ్గధారాశ
యనంబును, మొదలగు మహాఘోరనరకంబులు విలోకింపక సేతు
స్నాత సుఖించు సేతుయాత్ర గావింతునని తలంచి యెవ్వండేని
నూడడుగులు నడచు నతండు పంచమహాపాతకంబులు విడనాడి
యీ చెప్పిననరకంబులు గనుంగొనక కైవల్యంబు నొందు.

21


గీ.

మానవుఁడు సేతుసైకతమధ్యధూళి
పాళిఁ బొదలుచు నెవ్వాఁడు పవ్వళించు
నతని మెయి నెన్నిరేణువు లంటి నిలుచు
నన్నిద్విజహత్యలు నశించు నాక్షణంబ.

22


క.

తీరమృదుసేతుమధ్యస
మీరాంకురసముదయములు మేనులపైనిం
పారఁగ సోకినజనుల క
పారమహాఘోరపంచపాపము లడఁగున్.

23


సీ.

మార్గభేదియును బ్రాహ్మణదూషకుండును,
        స్వార్థపాకియును నత్యాశనుండు
వేదవిక్రీతయు వీ రేవురును బ్రహ్మ
        ఘాతకు ల్మఱి విప్రగణములకును
ధనముఖ్యవస్తువుల్ తగనిత్తునని పిల్చి
        యంత లేదని పల్కునట్టివాఁడు
ధర్మరహస్యంబు తనకు బోధించిన
        గురునితో వైరంబు గూర్చువాఁడు


గీ.

చెరువునకు నీరు ద్రావంగఁ జేరునట్టి
గోగణంబుల మరలించు కుత్సితుండు
బ్రహ్మఘాతుకులని చెప్పఁబడినవీర
లనఘు లగుదురు సేతుమజ్జనమువలన.

24