పుట:రామాయణ విశేషములు.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

నా మనవి

శ్రీమద్రామాయణ పవిత్రకావ్యమును ఒక్కమారే చదివి నాకు తోచిన విషయములను విభూతి పత్రికలో ప్రకటించితిని. పండిత శ్రీ చిదిరెమఠము వీరభద్రశర్మగారు అయాచితముగా ధ్వనియుక్తముగా తమ మాటగా వ్రాసిన వాక్యాలకు కృతజ్ఞుడను. పండిత శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశర్మగారు నా కోరిక పై పీఠిక వ్రాసియిచ్చినందులకు నా హృదయపూర్వకమగు కృతజ్ఞతలను మనవి చేసుకొనుచున్నాను. నేను నా శైలిలో ఉద్దేశపూర్వకముగా వ్యావహారిక పదాలను వాడినాను. గ్రాంథిక వ్యావహారిక సమన్వయ శైలికై ప్రయత్నించుచున్నాను. విభూతినుండి 200 ప్రతులనే తీసికొని యున్నందున ఎక్కువగా ప్రచురించుటకు వీలులేకపోయినది. యుద్ధానంతరము అవసరమని ప్రోద్బలము కల్గుచో పునర్ముద్రణ మగును. కాదేని ప్రపంచానికిగాని నాకుగాని నష్టములేదు.

సురవరం ప్రతాపరెడ్డి


(ప్రథమ ముద్రణ పీఠిక)