పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

27


మంబులు వ్రాయక మనంబునఁ దలంచుకొన నుంచుకొనియె నని తానె పొసగించి,
యవియే నాలుగువిధంబుల నిట్లనుచుఁ జదివె.

110


క.

కృష్ణా నిను మది మఱవను, కృష్ణా నను నెనరు మఱచి కినియకు నాపైఁ
గృష్ణా కనికర ముంచర, కృష్ణా యని తలఁచినపుడె యెనసెద ననరా.

111


క.

కృష్ణా కనికర ముంచర, కృష్ణా యని తలఁచినపుడె యెనసెద ననరా
కృష్ణా నిను మది మఱవను, కృష్ణా నను నెనరు మఱచి కినియకు నాపై.

112


క.

నిను మది మఱవను కృష్ణా, నను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా
కనికర ముంచర కృష్ణా, యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా.

113


కనికర ముంచర కృష్ణా, యని తలఁచినపుడె యెనసెద ననరా కృష్ణా
నిను మది మఱవను కృష్ణా, నను నెనరు మఱచి కినియకు నాపైఁ గృష్ణా.

114


క.

అని రచనఁ బొగడి కృష్ణుఁడు, మనమున సంతోష మంది మక్కువఁ జిలుకన్
గనుఁగొని గ్రక్కునఁ జను మిఁక, ననువుగ నే ఱేపె వత్తు నని తెల్పవలెన్.

115


గీ.

మొదలఁ బదివేలనేరముల్ మోచియున్న, నేను నేఁ డింక నేమన్న నిక్కమగునె
రాధతోఁ దెల్పు మొకమాట "రమణి ఱేపె, నీదు పదమాన వచ్చెద నిజ" మటంచు.

116


క.

అని మారుకమ్మ యొసఁగిన, వినయంబునఁ గొని శుకంబు వినువీథి వడిన్
జనుదెంచెను వ్రేపల్లెకు, మునుపటి తనపక్షపాతమును గనుపింపన్.

117


గీ.

వచ్చుచిలుకఁ జూచి వనిత దిగ్గున లేచి, బార చాచి తిగిచి గారవించి
పోయినట్టిపనులు కాయొ పండో యన్నఁ, బండుపండు ఱేపు పండు గనిన.

118


క.

ఇంతమొగ మంత చేసుక, యంతింతనరాని నిస్తులానందముతోఁ
గొంతవడి యూరకుండి త, నంతనె రాచిల్కఁ జూచి యంగన వల్కెన్.

119


ఉ.

కంటివె కన్నులార నవకంతుని రూపము; వీనులారఁగా
వింటివె వానిమాట; లొడవెంబడినైనను నన్ దలంచునా;
యంటివె కృష్ణ కృష్ణ యని; హా శుకమా! పొడఁగంటి నీవు మా
వంటియదృష్టహీనులకు వాని గనుంగొనుభాగ్య మబ్బునే?

120


క.

ఉన్నాఁడో గోపాలుఁడు?, విన్నాఁడా నీదుమాట? వేడుక వచ్చే
నన్నాఁడా నీతోడను?, మన్నాఁడా యేడనైన మక్కువతోడన్?

121


ఉ.

ఏమనె నేమి పల్కె నిను నే మని పంపెను నన్ను దూఱెనో
రామనెనో పరాకిడెనొ రాజులయేలిక కృష్ణమూర్తి నా