పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/83

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

79


మదనునిఁ గోరిన రప్పిం
చేదఁ జెప్పుఁ డటన్నఁ బ్రీతిఁ జెలంగి లతాంగుల్.

114


సీ.

ఓయమ్మ నేఁడు మే ముత్సవాహ్వయకేళి
                       కాననాంతరసీమ గౌరినోమఁ
జని విహారంబులు సలిపి క్రమ్మఱి రా ర
                       సాలవేదికపై విశాలనేత్రు
డాజానుబాహుఁ డత్యంతమోహనమూర్తి
                       యొకరాజనందనుం డొంటి నుండ
మనకాంతిమతి చూచి మన్మథుఁడను భ్రాంతి
                       నుల్లంబు దురపిల్ల నున్నయదియు


గీ.

విన్నవించితి మంతయు వెఱపు లేక
యింకమీఁదటఁ గర్తవ్య మెద్ది గలదు
దెలిసి బాలిక విభ్రాంతిఁ దీర్పుఁ డనుచు
జెలులు పలుకంగ నప్పు డచ్చెరువు దోఁప.

115


క.

మతిశాలి రాజశేఖర
పతి యనిపిన దివ్యరత్నపంజరశుకమున్
జతురతఁ గైకొని యప్పుడు
చతురిక యేతెంచి రాజసమ్ముఖ మగుటన్.

116


గీ.

తరుణి చేతికి నిచ్చుట తగవుగామి
నృపతిసన్నిధి నిడి దేవ నేఁడు నేను
వనవినోదంబునకుఁ బోయి వెనుక చిక్కి
రాఁగ నొకచక్కిఁ జక్కనిరాజసుతుఁడు.

117


క.

మీరాజు సమ్ముఖంబున
నీరాజశుకోత్తమంబు నిడుమన నిడి యే
కారణమొ యనుచుఁ దెచ్చితి
భూరమణవరేణ్య యనుచుఁ బొలఁతి తొలంగన్.

118