పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

47


గీ.

రసి రసాన్నము లీరీతి రత్నపుత్త్రి
యర్పణము చేయ వేడుక నారగించి
రాజు రాజీయ రాజకీరమును దృప్తిఁ
బొంది వసియింప నంత నద్భుతముతోఁప.

132


గీ.

సతులు భాండాదివస్తుసంతతులు మగుడఁ
దాల్ప లోఁగొని కాళికాదత్తదివ్య
రత్న మేపారె నారాజరత్న మెదుట
విశ్వరూపంబుఁ జూపిన విష్ణుఁ డనఁగ.

133


క.

అమ్మణిప్రభావమునకున్
సమ్మదమునఁ బొంది రాజచంద్రుఁడు మాళిం
గ్రమ్మఱఁ దాల్చి విభాకర
సమ్మిళితప్రథమశైలసమత వహించెన్.

134


గీ.

అపుడు కీరకులస్వామి ననుచరించి
వితతఫలముల చవులు చూచితివె తనియ
సకలభాషావిశేషవిజ్ఞానచతుర
యింత యొప్పిదమయ్యెనే యీదినంబు.

135


శా.

కాళీదైవతదత్తరత్నమహిమల్ గంటే వధూరూపరే
ఖాలాలిత్యము చెప్పఁ గ్రొత్త బహుశాకద్రవ్యసంభారధా
రాళస్వచ్ఛసుధారసోన్నతి యనిర్వాచ్యంబు కస్తూరికా
కాలాగర్వసులేపసౌరభము లాఘ్రాణింప నిం తొప్పునే.

136


క.

మతిఁదలఁపఁ జోద్య మిది యో
పతగకులత్తంస యనుచుఁ బలికినఁ బ్రీతిన్
జతురాగమార్థసంగ్రహ
చతురుఁడు శుకలోకపాకశాసనుఁ డనియెన్.

137


శా.

ఓరామామకరాంక యోరిపుజయోద్యోగాతి నిశ్శంక నీ
యారూఢోన్నతి నీకుఁ గానఁబడ దాహా రాజమాత్రుండవే