పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

రాజశేఖరచరిత్రము


క.

జనకునకును జయలేఖల
ననిచి పురంబునకు సైనికావళిఁ బోవన్
బనిచి తపస్వియుఁ దానును
మనుజేంద్రుఁడు బదరికాశ్రమంబున కరిగెన్.

105


మ.

అతఁ డచ్చోటకిఁ బోయి కన్గొనియె భూజానేకశాఖాశిఖా
న్వితయౌ మౌనికరస్థముక్తితరుణీవేణీకలాపాకృతిన్
సతతావర్తితసప్తతంతుహుతభుక్సందోహనీరంధ్రని
ర్గతధూమోద్భటహృద్యగంధములు దిగ్భాగంబులం గ్రమ్మఁగన్.

106


సీ.

హెమధేనువ్రాత మొయ్యనట్టలు చాప
                       గొనగోళ్ళ దువ్వెడు క్రోలుపులులఁ
జిగురుదర్భలు గిల్లి మృగపోతముల కర్థి
                       నందంద యిచ్చు పంచాననముల
రాచిల్క బోదలఁ బ్రోచి ఱెక్కలనీడ
                       జల్లఁగా బొదివెడు సాళువముల
బర్హణనిలయంపుఁ బన్నగార్భకముల
                       కుగ్గులు వెట్టు మయూరములను


గీ.

దొండము ల్ముంచి కలఁగక యుండఁ దీర్థ
వారి దరినుండి క్రోలెడు వారణములఁ
జూచి యచ్చెరు వంది యస్తోకమౌని
వరతపశ్శక్తి మెచ్చుచు వచ్చు నపుడు.

107


గీ.

మునుల వెంబడి నవ్వార్త విని చెలంగి
భానుమతి తల్లి యెదురుగాఁ బాఱుతెంచి
కన్నుఁగొనలను హర్షాంబుకణము లొలికి
జాలుకొనఁ జెప్పెఁ బాలిండ్లు బాలు దొలఁక.

108


ఉ.

ఎత్తి కవుంగిలించి యొకయించుక సేపతి గాఢకౌతుకా
యతతం తన్నుఁదా మరచి యంగలతన్ బులకాంకురాళి పె


.