పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

31


ఉ.

మంచిది యందు కేమి యని మంత్రులమోములు చూచి నవ్వి న
క్తంచరభర్త యెల్లి మనదానవకోటికి భుక్తిగాఁగ మ
ట్టించెద వానిసేనలఁ గడింది మగంటిమిఁ గాళికావరో
దంచితలోహసైంధవఖురాగ్రములన్ లయకాలు కైవడిన్.

55


వ.

అనిన విని సచివనికరం బి ట్లనియె.

56


సీ.

కాకోదరస్వామి కంఠనాళంబులు
                       పుడుకుదుమే యొక్కపూటలోన
సుత్రాముఁ బట్టి యీడ్చుకవచ్చియిట వ్రేలఁ
                       గట్టింతుమే యొక్కగడియలోనఁ
గులమహీధ్రముల నుగ్గులుగాఁగఁ బిడికిళ్ళఁ
                       బొడుతుమే యొక్కింతతడవులోన
గూర్మాధిపునివెన్ను గులగులల్గాబిట్టు
                       మట్టుదుమే మాటమాత్రలోన


గీ.

ముజ్జగంబులు నొక్కట మొనసెనేని
మీఱి నీదాఁక రానిత్తు మేనిశాచ
రేంద్ర నీసత్యమొగిని నీ వెఱుగ వెందు
నిన్ను మార్కొని మర్త్యులే నిలుచువారు.

57


క.

అట్లు పలుకు మంత్రుల విశం
కటదనుజూధముఁడు చూచి ఘనులారా! మహో
ద్భటపరభటకోట్లన్ మ్రిం
గుటయుం ద్రుంచుటయు నేఁడు క్రొత్తలె మీకున్.

58


సీ.

కాల్వురలెక్క కగ్గలముగాఁ గొని యేగి
                       దీర్ఘాస్యుఁ డెలగోలు దివియువాఁడు
చటులప్రభంజనజవతురంగంబులఁ
                       బ్రేతజిహ్వుం డేర్పరించువాఁడు
కదిసి దట్టంబుగా గంధసింధురఘటల్
                       భీమకేతుఁడు నడపించువాఁడు