పుట:రఘునాథ తొండమాన్ వంశప్రతాపమాలిక.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండుపటాళాలు రెండుపిరంగులు కుంపినిఝంటాను గొనుమటంచుఁ
బ్రేమతో నొసఁగఁగ సీమకుఁ గొని[1]పోయి [2]పడవాళ్లు గమికాండ్రు బలసికొలువ
లీలగా లాటు వాలీసుమెడీనను సరదార్లు రీపుపై సాగునవుడు
రహిని రాజవిజయ రఘునాథతొండమాన్ బహదరువారికి వ్రాసిపంప
నాలాగె పంపిన నాశూరపర్యులు బోరున మున్నీరు పొంగినట్లు
కణవాయిపై సాగ గడుసైనతావులఁ గొందలసందులఁ గోనలందుఁ
బొంచియున్న రిపుల వంచనల నెఱింగి ముందు పిరంగులు పొందుపఱచి
ద్రాక్షగొలలువోని తఱుచైనగుండ్లను విచ్చుగుండ్లు మఱియుఁ బెద్దగుండ్లు
బారుచేయుచుఁ జూచి ఫైరని పల్కినఁ బెళపెళపెళయని బెడిదముగను
ఏకముహూర్తాన నెన్నంగరానట్టి గుండులు వెలువడి గండశిలలఁ
దగిలినవేగానఁ బగిలినచిల్లులు విరియుగుండ్ల వలన వెడలుతునుక
లిసుక చల్లినరీతి నెడలేక విరిసిన నిలువలేకయు వారు కలఁగిపాఱఁ
దఱిమి పైసాగంగదండును నడిపించి శ్రీరంగపట్నముచెంతను దిగి
మొదట నుత్తరప్రక్క మోర్చాలు సవరించి పిరంగులు బిగించి వీథిబడిని
నాలుగేగుండులు నగరివాకిలిముందు పడునట్లుసేసిన వగనుజెంది
కౌలుపల్కుమటంచుఁ గార్యగాండ్రను బంప నేమికవులటన్న నిపుడు మాదు
కోట లెస్సగఁ గట్టి కోటకుఁదగినట్టి రస్తువుల్ తగనుంచి రహిని మించి
యైదేండ్లు గానిచ్చి యావల వచ్చిన జగడముగావచ్చు సాగుఁడనుచుఁ
గోట్లసంఖ్యధనము గొమ్మని యిచ్చినఁ దీసుక సీమకుఁ దిరిగివచ్చి
యబులుండ నొకనాఁడు నారీసాహెపు సేసెడు దుర్నీతి చెవులవినిన
జన్నలగ్నీసనన్ సరదారు కోపించి పదిలముగను పైనిబడఁగ నెంచి
పదిఋజుము ట్లిఱువదిపటాళంబులు తురుపులు పదివేలు తురగములును
గొప్పపిరంగులు గుండ్లు వగలబండ్లు మందుపీపాయిలు పొందుపఱిచి
రహిని రాజవిజయ రఘునాథతొండమాన్ బహదరు జనములఁ బదిలముగను
మద్దత్తుగా వచ్చి మనదండునకు మీరు కుముకుగారండని కోరివ్రాయ
నాలాగె నడిపింప నటసాగిరండని ముందుసాగినదండు ముదముతోడఁ
బదపద యనుచును బారుతీరుగ సాగి శ్రీరంగపట్నము చెంతఁ జేరి
కోటమర్మమెఱుంగ గుండ్లకు వెలిగాను నిలిచి యద్దానిలోనెల వెఱింగి

  1. ఇచ్చి
  2. దొరవారి కొప్పించి మెఱయుచుండ